ఘనంగా బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

ఘనంగా బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నాగారం నేటిదాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

నాగారం డివిజన్ బీజేపీ అధ్యక్షులు కొండబోయిన నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో నాగారం డివిజన్‌లో పెద్ద ఎత్తున బీజేపీ జెండాలు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రా రెడ్డి పాల్గొని మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ నేషన్ ఫస్ట్ అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతుందని తెలిపారు.
47 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో పార్టీ నాయకులు, కార్యకర్తల త్యాగాల వల్లే ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే భావంతో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే పార్టీ లక్ష్యమని చెప్పారు. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి అంత్యోదయ సిద్ధాంతాన్ని గుర్తు చేస్తూ, సమాజంలోని చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ పథకాలు చేరాలనే లక్ష్యంతో బీజేపీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నాగారం డివిజన్‌ ను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. నాగారం డివిజన్‌లో సుమారు 20 బూత్‌లలో జెండాలు ఎగరవేయడం పార్టీ ఎదుగుదలకు మంచి పరిణామమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మునిగంటి సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు శ్యామ్ సుందర్ శర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి బుధవరం లక్ష్మి, మాజీ ఎంపిటిసి తరిగొప్పుల బలరాం, మాజీ కౌన్సిలర్ బిజ్జా శ్రీనివాస్ గౌడ్ ,మాజీ పీఎస్ఎస్ డైరెక్టర్ కొండేటి ఎల్లారెడ్డి, సీనియర్ నాయకులు బొమ్మిడి బుచ్చిరెడ్డి, రామారం మహేందర్ గౌడ్, నక్క కిషోర్ గౌడ్, డివిజన్ ప్రధాన కార్యదర్శులు మామిడి జంగారెడ్డి, పోతంశెట్టి వెంకటేశ్వర రావు, ఉపాధ్యక్షులు వల్లల శ్రీనివాస్ గౌడ్, ఎలసాని నాగరాజ్ యాదవ్, కార్యదర్శి బోల్లపు సురేందర్ రెడ్డి, సతీష్ రెడ్డి, నాయకులు శంకర్ రెడ్డి , జమ్మల శంకర్ తాటకొండ రవీందర్,బుధవరం వేణుగోపాల్, రవీందర్ రెడ్డి, సూర్య శేఖర్ రెడ్డి, నెల్లుట్ల నవీన్, మంచాల మహేందర్, జూపల్లి నరేష్, అక్కల సురేష్, భువనేశ్వరి, విజయలక్ష్మి, ముద్రగణం శ్రీనివాస్ యాదవ్, సూర్వి రాజు, రమాదేవి, షాజీ, కృష్ణ చారి, విజయ్, సతీష్ , శ్రీకాంత్ యాదవ్, బూత్ అధ్యక్షులు శంకర్ ముదిరాజ్, కత్తురోజు అశోక్ చారి, వెంకట చారి, గుమ్మడి చంద్ర రెడ్డి, యాదగిరి, మహేష్, సంజయ్, కుమార్ యాదవ్, పొట్ట సుధాకర్, మల్యాల మధు, రఘు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version