రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో రామడుగు మండల పరిషత్ ఇంచార్జి ఎంపీపీగా ఇటివల బాధ్యతలు స్వీకరించిన పూరెల్ల గోపాల్ గౌడ్ ని ఆలిండియా రెడ్డి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బిరెడ్డి కరుణాకర్ రెడ్డి ఘనంగా సన్మానించిన అనంతరం స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో పంజాల శ్రీనివాస్, గాజుల శ్రీనివాస్, నీలం లక్ష్మీరాజ్యం, రాజమౌళి, రాజేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.