బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్ కాంపెల్లి సతీష్ మాదిగ గారికి దళిత రత్న అవార్డు ప్రధానోత్సవం
బెల్లంపల్లి( మంచిర్యాల)
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ రవీంద్ర భారతిలో గురువారం మహనీయులు జ్యోతిరావుబాపులే,బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలలు దళిత బహజన సంఘాల ఆధ్వర్యంలో భాగంగా దళిత రత్న అవార్డుల ప్రత్యేక కార్యక్రమం జరిగింది.ఈ యొక్క మహానీయుల జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ మాదిగ గారు మరియు, ఉత్సవాల కమిటీ వైస్ చైర్మన్ మేతరి రోజా రాణి మాదిగ గారు మరియు గౌరవ అధ్యక్షులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మాదిగ గారు,మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వ్యవస్థాపకులు రేగుంట సునీల్ అన్న మాదిగ గారి చేతుల మీదగా దళిత రత్న అవార్డు అందుకున్న మాదిగ హక్కుల దండోరా బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు కాంపెల్లి సతీష్ మాదిగ, దళిత రత్న అవార్డు గ్రహీత కాంపెల్లి సతీష్ మాదిగ మాట్లాడుతు మహానీయుల ఆశయాలను కొనసాగిస్తూ దళిత బహుజనలకు అత్యున్న విద్య మరియు జాతి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేయడమే నా లక్ష్యం అని చాటి చెప్పాడు.దళిత రత్న అవార్డు ఇచ్చినందుకు అందరికి సామాజిక ఉద్యమ నమస్కారలు తెలియజేశాడు
