నేత్రధానం చేసి ఇద్దరు అంధులకు చూపునిచ్చిన బర్ల రాజక్క

ముత్తారం :- నేటిధాత్రి

ముత్తారం మండలం,లక్కారం గ్రామనివాసి బర్ల రాజక్క మరణించగా,సదాశయ ఫౌండేషన్ సెంటినరీ కాలనీ కన్వీనర్,వీరి బంధువైన ఐలి మధు నేత్రదానం గురించి అవగాహన కల్పించగా కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో ఎల్ వి పి ఐ బ్యాంక్ టెక్నీషియన్ ఉపేందర్ సహకారంతో నేత్ర సేకరణ చేసి హైదరాబాద్ ఐ బ్యాంక్ పంపించడం జరిగింది.ఇద్దరు అంధులకు వెలుగులు ప్రసాదించుటకు సహకరించిన కుమారులు బర్ల లింగయ్య,సదానందం , కూతురు కనకమ్మ లకు మరియు కుటుంబ సభ్యులకు,సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు టీ.శ్రావణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి, రాష్ట్ర మీడియా కార్యదర్శి కె.యస్.వాసు , జిల్లా అధ్యక్షుడు రాజమౌళి,సి ఎన్ సి కార్యదర్శి కె.సమ్మయ్య వారికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *