*నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ*
పాలకుర్తి (జనగామ):నేటి ధాత్రి, కరోనా వైరస్ నేపధ్యంలో లాక్ డౌన్ సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మండలంలోని బొమ్మెర గ్రామంలోని నిరుపేదలకు, గ్రామపంచాయతీ సిబ్బంది, ఆశా వర్కర్లకు గ్రామస్థుడు పేరపు కుమార్ నిత్యావసర సరుకులను పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాలకుర్తి ఎస్సై గండ్రాతి సతీష్ పాల్గొని మాట్లాడుతూ నిరుపేదలకు సహాయం అందించిన పేరపు కుమార్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగభూషణం, రాపాక సత్యనారాయణ, బత్తిని సురేష్, కుంట శ్రీనివాస్,…