మృతుల కుటుంబాలకు ఘన నివాళులు..

మృతుల కుటుంబాలకు ఘన నివాళులు
మెట్ పల్లి ఏప్రిల్ 26 నేటిదాత్ర

 

 

 

 

శనివారం పట్టణంలోని టిపిసిసి డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు నివాసములో కాశ్మీర్ పహల్ గావ్ లో భారతీయ పౌరులపై ఉగ్రవాదుల దాడిలో మరణించిన కుటుంబాలకు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో ప్రజలపై ఉగ్రవాదుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మతోన్మాదులు పర్యాటకులను కాల్చి చంపడం హేయమైన చర్య అని అన్నారు. ప్రపంచ దేశాలు భారతదేశంపై సంఘీభావం ప్రకటించడం పట్ల భారతదేశం శాంతి యుత వాతావరణంలో ప్రజలను. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులను గుర్తించి కఠినంగా శిక్షించి మరొక సారి ఇలాంటి దాడులు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మృతిచెందిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు
ఈ కార్యక్రమంలో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా, కాంగ్రెస్ పార్టీ ఫిషర్మేర్ స్టేట్ జనరల్ సెక్రెటరీ రుత్త నారాయణ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదళ్ జనరల్ సెక్రెటరీ అందె మారుతి బాపూజీ,ఇబ్రహీపట్నం యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ నల్లూరి సాగర్, కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ జాఫర్, బైండ్ల శ్రీకాంత్, మామిడి రాజశేఖర్ రెడ్డి, ఇప్పపల్లి గణేష్ గౌడ్,తోగిటి నాగరాజ్, మొగలి రాజేందర్,కోరే రాజ్ కుమార్, చౌదరి తదిరితలు పాల్గొన్నారు.

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి.!

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

మాజీ సర్పంచ్ మోటి ధర్మారావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

 భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో. ఈనెల 27న జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మొగుళ్ళపల్లి తాజా మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు తెలిపారు. శుక్రవారం రోజున ఆయన మాట్లాడుతూ. మొగుళ్లపల్లి మండలంలోని అన్ని గ్రామాలలోని నిరుద్యోగ యువతీ,యువకులకు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగ యువతీ యువకులు .ఈ జాబ్ మేళాకు 18 నుండి 35 సంవత్సరాల వయసుగల చదువుకున్న, చదువు లేని నిరుద్యోగ యువతీ యువకులు అర్హులని మోటె ధర్మారావు తెలిపారు.

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి.

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

మాజీ సర్పంచ్ మోటి ధర్మారావు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

 

 

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో. ఈనెల 27న జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మొగుళ్ళపల్లి తాజా మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు తెలిపారు. శుక్రవారం రోజున ఆయన మాట్లాడుతూ. మొగుళ్లపల్లి మండలంలోని అన్ని గ్రామాలలోని నిరుద్యోగ యువతీ,యువకులకు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగ యువతీ యువకులు . ఈ జాబ్ మేళాకు 18 నుండి 35 సంవత్సరాల వయసుగల చదువుకున్న, చదువు లేని నిరుద్యోగ యువతీ యువకులు అర్హులని మోటె ధర్మారావు తెలిపారు.

ప్రమాదం లో బుర్కపల్లి వాగు వంతెన.

ప్రమాదం లో బుర్కపల్లి వాగు వంతెన

బయందోళనలో ప్రయాణం సాగిస్తున్న ప్రజలు

కొత్తగూడ, నేటిధాత్రి :

 

 

 

 

మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం నుంచి గంగారం ఇల్లందు వెళ్లే దారిలో మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి బుర్కపల్లి వాగుపై వంతెన ఎప్పుడో తాతల కాలం నాటి నిర్మించినది.. అది కూడా వెడల్పు లేకుండా ఉండడంతో వర్షాకాలం వచ్చిందంటే బ్రిడ్జి పైన నుంచి నీళ్లు వెళ్లి రాకపోకలకు అంతరాయం జరుగుతూ ఉంటుంది.. వర్షాకాలంలో వాగు ఉప్పొంగి వరద ఉధృతికి బ్రిడ్జి పూర్తిగా దెబ్బతిని భారీ వాహనములు బ్రిడ్జిపై వెళ్తుండడంతో బ్రిడ్జ్ పిల్లర్లు రాళ్లు ఇసుక కంకర అన్ని కొట్టుకపోయాయి బ్రిడ్జి ఎప్పుడు కూలిపోతుందని ప్రయాణికులు భయంకరమైన చెందుతున్నారు కావున ఉన్నత అధికారులు తక్షణమే స్పందించి పాత బ్రిడ్జి స్థానంలో మరింత వెడల్పుగా కొత్త బ్రిడ్జి నిర్మించాలని ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని కొత్తగూడ గంగారం మండలాల ప్రజలు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు..,,

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కాంగ్రెస్.!

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఆదేశాల మేరకు శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని,ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో వరి పంట ఎక్కువ దిగుబడి అవుతుందని అన్నారు. రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతు పక్ష పాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిందని తెలిపారు.సన్న వడ్ల ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికె దక్కిందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చల్ల సత్యనారాయణ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ గుండు తిరుపతి,వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామ రైతులు, సెంటర్ ఇన్చార్జి బల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

భూభారతిపై అవగాహన కార్యక్రమం.

భూభారతిపై అవగాహన కార్యక్రమం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి అవగాహన కార్యక్రమాన్ని.రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్.నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూభారతి చట్టంలో వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ.రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకువచ్చిన భూభారతి నూతన ఆర్ ఓ ఆర్.చట్టంపై తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సదస్సులో కలెక్టర్ పాల్గొని చట్టంలోని వివిధ అంశాలను ప్రయోజనాలను ప్రజెంటేషన్ ద్వారా రైతులకు ప్రజలకు క్లుప్తంగా వివరించడం జరిగిందని. అలాగే శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలోని గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూధార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తుందని దీని ద్వారా భూ అక్రమాలకు చెక్ పెట్టవచ్చునని పెండింగ్లో ఉన్న సాదా బైనామ పరిష్కారం కోసం భూభారతి. చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని పి ఓ టి. ఎల్.టి.ఆర్ సీలింగ్ చట్టాలు ఉల్లంఘనలు లేని దరఖాస్తులను క్రమబద్ధీకరణ చేసే నాటి స్టాంప్ డ్యూటీ 100 రూపాయలు అపరాధ రుసుము వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని. హక్కుల రికార్డులు వివరాలను నమోదు చేసి పాస్ బుక్ జారీ చేయడం జరుగుతుందని వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఒకేరోజు ఉంటాయని కొనుగోలు తనక బదిలీ బాగా పంపకాల ద్వారా భూమిపై హక్కులు సంకల్పిస్తే తాసిల్దార్ .రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డులను మార్పు చేసి పట్టాదారు పాసుబుక్ జారీ చేస్తారని .స్లాట్ బుకింగ్ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ న్యూట్రిసియేషన్ .ఫీజు చెల్లింపు అంటే నిర్ణీత తేదీల్లో చట్ట ప్రకారం సొంత దస్తావేజు రాసుకొని సమర్పించాల్సి ఉంటుందని దస్తావేజుతోపాటు ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి భూమి పట్టం సమర్పించాలని తెలియజేశారు చట్టంపై అవగాహన కల్పించేలా కరపత్రాలు పంపిణీ చేశామని ప్రజలు వీటిని గమనించాలని ఏమైనా సందేహాలు ఉంటే తీర్చడానికి అధికారులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేశారు రైతులకు ఎటువంటి భూ సమస్యలు ఉన్న భూభారతిలో పరిష్కరించవచ్చని పేర్కొంటూ ప్రతి గ్రామానికి ఒక విలేజ్ రెవెన్యూ అధికారిని నియమించడం జరుగుతుందని తద్వారా రైతులకు భూభారతిలో ఎటువంటి సమస్యలు వచ్చిన పరిష్కరించడానికి చాలా సులువుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి అవగాహన కార్యక్రమానికి రైతులు ఆర్డీవో రాధాబాయి ఎమ్మార్వో జయంత్ కుమార్ గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప తిరుపతి రెడ్డి వైస్ చైర్మన్.నేరెళ్ల నరసింహం గౌడ్.ప్రభుత్వ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మహిళా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫామ్లు.

మహిళా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫామ్ లు కుట్టి వేత…

రామాయంపేట ఏప్రిల్ 26 నేటి ధాత్రి (మెదక్)

 

 

ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ లు కుట్టి అందించే బాధ్యత ప్రభుత్వం మెప్మ, ఐకెపి కి అప్పగించింది. దీంతో మహిళా సంఘాలను ప్రోత్సహించి ఈ యూనిఫాంలు కుట్టించే బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించారు. ఇందుకు ఒక యూనిఫామ్ కు రూ. 75 రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది.

Students

 

ఒక రకంగా ఇది మహిళా సంఘం లో టైలరింగ్ వచ్చిన వారికి మంచి అవకాశం. గతంలో కూడా తాము విద్యార్థులకు యూనిఫామ్ లు కుట్టించి ఇచ్చామని, ఇప్పుడు కూడా తమకు యూనిఫాంలు కుట్టడానికి ఎంపిక చేసినట్లు మహిళా సంఘాల సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మర్కు లావణ్య. ఆర్ లావణ్య. జి స్రవంతి. పి స్వాతి. సిహెచ్ కవిత. ఆర్ తరంగిణి. బి బాల్ లక్ష్మి. కె శ్రీలత. ఆర్ స్రవంతి. పి శ్రీలత. తదితరులు పాల్గొన్నారు.

పహెల్గమ్ ఉగ్రదాడిని ఖండించండి.

పహెల్గమ్ ఉగ్రదాడిని ఖండించండి

మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

నర్సంపేట నేటిధాత్రి:

 

 

 

 

జమ్మూ కాశ్మీర్ లోని పల్గామ పర్యటక ప్రాంతంలో ఉగ్ర మూకలు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ బిఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో మౌనం పాటించారు.

ఘటనను ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా బిఆర్ఎస్ జిల్లా నాయకులు నల్ల మనోహర్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు నాగేల్లి వెంకటనారాయణ మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ వైఫల్యంతో ఈ ఘటన జరిగిందని నిగ్గు వర్గాలు హెచ్చరించిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఉండటంవల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు.

దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలని మృతి చెందిన కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో పెకిలించి అంతమొందిస్తామని బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి చెప్పుతూ రాజకీయ లబ్ధికే వాడుకుంటుంది తప్ప ఆచరణలో సాధ్యం కావడం లేదని గతంలో జరిగిన పుల్వామా దాడి నుండి నేటి వరకు దేశంలో అనేక చోట్ల ఇలాంటి మారణ హోమాలు జరగటమే నిదర్శనమని అన్నారు.

దేశ భద్రత కోసం ఉగ్రవాదం అంతం అందించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్న బిఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్టియు జిల్లా అధ్యక్షులు గోనే యువరాజు, సీనియర్ నాయకులు రామారావు, మాజీ కౌన్సిలర్లు బండి రమేష్, మండల శ్రీనివాస్, శివరాత్రి స్వామి వాసం సాంబయ్య దేవూజు సదానందం, పెండెం వెంకటేశ్వర్లు, బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు పుల్లూరి స్వామి, వార్డు అధ్యక్షులు బీరం నాగిరెడ్డి, సంపంగి సాలయ్య, పెరమండ్ల రవి, రావుల సతీష్, రాయరాకుల సారంగం, రచ్చ రఘు, కుంకీసా కుమార్ రుద్రారపు పైడయ్య, గుండెబోయిన కోటి, పోతరాజు బాబు గౌడ సంఘం అధ్యక్షుడు గిరిగాని సాంబయ్య నాయకులు పైసా ప్రవీణ్, తోట సదానందం గోనెల కర్ణాకర్, మద్దెల సాంబయ్య భోలే పాషా రాపోలు రాములు రాపోలు శీను, రాపోలు సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

రజోత్సవ సభను విజయ చేయాలి వంతం

రజోత్సవ సభను విజయవంతం చేయాలి ….

జహీరాబాద్  నేతి ధాత్రి:

బిఆర్ఎస్ నిర్వహించే ఓరుగల్లు రజతొత్సవ సభను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ నాయకుడు షేక్ సోహెల్ అన్నారు ఝరాసంగం మండలంలోని ప్రతి గ్రామం నుండి నాయకులు గాని కార్యకర్తలుగాని అభిమానులు పెద్ద ఎత్తున ఈ సభను తరలి వెళ్లి విజయవంతం చేయాలని అన్నారు బిఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కోసం యువత మరియు రైతన్నలు ప్రతి ఒకరు గులాబీ సైనికులు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు జహీరాబాద్ శాసన సభ్యులు కొనింటి మాణిక్ రావు గారి నేతృతంలో ఝరాసంగం మండలం నుండి పెద్ద ఎత్తున సభకు తరాలి రావాలన్నారు. స్వరాష్ట్రం కోసం పుట్టిన జెండా గులాబీ జెండా మన జెండా మన కెసిఆర్ మన రాష్ట్రం అన్నారు జై తెలంగాణ జై జై తెలంగాణ..

రామకృష్ణాపూర్ కు బస్సు సౌకర్యం కల్పించండి..

రామకృష్ణాపూర్ కు బస్సు సౌకర్యం కల్పించండి..

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

క్యాతనపల్లి రైల్వే గేట్ సమీపంలో రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ నిర్మించిన నేపథ్యంలో రవాణా మెరుగుపడిందని, ప్రజల రాకపోకలకు అనువుగా ఉన్న నేపథ్యంలో బస్సు సర్వీసు నడిపించేలా చొరవ తీసుకోవాలని మంచిర్యాల ఆర్టీసీ డిపో అడిషనల్ క్లర్క్ ఎం ఎం రావు, స్టేషన్ మేనేజర్ గోలీ శంకర్ లకు టిపిసిసి జనరల్ సెక్రటరీ పిన్నింటి రఘునాథరెడ్డి తో కలిసి బస్సు సౌకర్యం కల్పించండి అని రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు వినతి పత్రం అందించారు. మంచిర్యాల నుండి రామకృష్ణాపూర్, ఆర్కే వన్ వరకు బస్సు లు నడిపించాలని కోరామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోపు రాజం, పలిగిరి కనకరాజు, రాం సాయి, భాస్కర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి.

ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి…

సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్

రామకృష్ణాపూర్, నేటిదాత్రి:

 

 

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ సీపీఐ పార్టీ క్యాతనపల్లి మున్సిపాలిటీ పట్టణ సమితి ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు.ఉగ్రవాదుల దుర్మార్గపు చర్యల వల్ల అమాయక ప్రజలు,పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని,ఉగ్రవాదులను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందినదని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ఆరోపించారు.కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు వనం సత్యనారాయణ, నక్క వెంకటస్వామి, కాదండీ సాంబయ్య, పార్టీ ప్రజా సంఘాల నాయకులు, మామిడి గోపి, ఎగుడ మొండి,సిర్ల ముకుందరేడ్డి, కస్తూరి మల్లారెడ్డి,గంగాదరి మల్లయ్య,బోయపోతుల కొమురయ్య,మోతుకుల రాజు, అన్నం శ్రీనివాస్, మా దాస్ శంకర్,గొడిసెల గురువయ్య, శ్రీకాంత్ ,చిరంజీవి,తదితరులు పాల్గొన్నారు.

కెనరా బ్యాంకు మేనేజర్ సైదులు.

కెనరా బ్యాంకు మేనేజర్ సైదులు బదిలీ కావడంతో సన్మానించిన రుద్రప్ప పటేల్

జహీరాబాద్. నీటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండల కెనరా బ్యాంకు మేనేజర్ సైదులు ఉద్యోగరీత్యా బదిలీ కావడంతో ముఖ్యఅతిథిగా హాజరయ్యా స్థానిక కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ నాయకులు రుద్రప్ప పటేల్, శాలువా పూలమాలలతో సన్మానించి తమ మండలానికి సేవలందించిన జ్ఞాపకాలుగా మారుతాయని వీడుకోలు పలికారు
ఈ కార్యక్రమంలో ఫిల్డ్ ఆఫీసర్ నిలేశ్ విఠల్ ,సిద్ధార్థ
అభిలాష్ రెడ్డి ,ల్యకత్ ,బసంతి పటేల్ ,సుధాకర్ రెడ్డి, లక్ష్మణ్,భాస్కర్ రెడ్డి, మజార్ అహ్మద్,శివమణి పటేల్, జగదీష్, నారాయణ,నగేష్ తదితరులు పాల్గొన్నారు

రజతోత్సవం.. గులాబీ జయ కేతనం!

`తెలంగాణ జన జాతర…బీఆర్‌ఎస్‌ 25 ఏళ్ల వేడుక

`ఉద్యమ ప్రస్థానంలో ఉరకలెత్తిన తెలంగాణ పార్టీ

`ముక్కోటి తెలంగాణ చేత జై తెలంగాణ అని జై కొట్టించిన పార్టీ

`ప్రజలంతా గుండెల్లో పెట్టుకున్న జెండా గులాబీ జెండా

`తెలంగాణ అంతా గులాబీ మయం

రజతోత్సవ సభకు అడుగడుగునా ఆటంకాలు ఏర్పరచి, సభ జరగకుండా అడ్డంకులు సృష్టించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన కుట్రలను తిప్పి కొట్టి, బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ సభ గురించి తరతరాలు చెప్పుకునేలా నిర్వహిస్తామంటున్న ‘‘బీఆర్‌ఎస్‌’’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ‘‘ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు’’, ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో జనజాతర గురించి పంచుకున్న విషయాలు ఆయన మాటల్లోనే..

`వరంగల్‌ నిండా బీఆర్‌ఎస్‌ జన సందోహం

`ఎటు చూసినా గులాబీ రెపరెపలే

`ఎక్కడ విన్నా గులాబీ పాటలే

`తెలంగాణ అంతటా రజతోత్సవ చర్చలే

`గులాబీ దండు కదులుతోంది…వడి వడిగా వరంగల్‌ చేరుతోంది

`గులాబీ సైనికుల తెలంగాణ కవాతు కోసం కళకళలాడుతోంది

`జనం గుండెలు నిండుగా గులాబీ వనం విరబూస్తోంది

`ఎప్పుడెప్పుడు గులాబీ జాతర అని ఎదురుచూస్తోంది

`లక్షలాది మంది వరంగల్‌ సభకు వస్తున్నారు

`కేసీఆర్‌ అంటేనే తెలంగాణ జీవం

`కేసీఆర్‌ మాటలే తెలంగాణకు వేదం

`ఆవిరైపోతున్న నీళ్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి

`తెలంగాణను ఎడారిగా మార్చిన కాంగ్రెస్‌ పై నీళ్లే కన్నెర్ర చేస్తున్నాయి

`అడుగంటుతున్న భూ గర్భజలాలు ఆక్రోషిస్తున్నాయి

`ఎడారిగా మారిన బీళ్లు కాంగ్రెస్‌ను నోళ్లు తెరిచి తిడుతున్నాయి

`నమ్మినందుకు తెలంగాణ తల్లికి చుక్క నీరందక వాగులు, వంకలు శాపాలు పెడుతున్నాయి

`మళ్ళీ కేసిఆర్‌ పాలన వస్తే గాని మాగాణ కళకళలాడతాయని గుర్తు చేస్తున్నాయి

`కేసిఆర్‌ పాలనే తెలంగాణకు స్వర్ణయుగం

`మళ్ళీ కేసిఆర్‌ పాలన కోసం ఎదురుచూస్తోంది తెలంగాణ జనం

హైదరాబాద్‌,నేటిధాత్రి:

రామ దండు గురించి రామాయణంలో చదవాం..పెద్దలు చెప్పగా విన్నాం..ఇప్పుడు కేసిఆర్‌ దండు కళ్లారా చూడండి. గులాబీ దండు గురించి రేపటి తరానికి చెప్పండి. భవిష్యత్తులో రామ దండు గురించేకాదు, గులాబీ దండు గురించి కూడా చెప్పుకుంటారు. వరంగల్‌లో జరిగే బిఆర్‌ఎస్‌ వజ్రోత్సవ సభను చూస్తే కాంగ్రెస్‌ పార్టీకి, బిజేపికి ముచ్చెటమటలు పట్టాలి. ఉక్కపోతలు పోయాయి. కంటిమీద కునుకు కూడా లేకుండా చేయాలి. అదే మా లక్ష్యం. అదే బిఆర్‌ఎస్‌ పార్టీ సభతో మా రజతోత్సవం. మళ్లీ తెలంగాణలో గులాబీ జయకేతనం కోసం తొలి అడుగుకు శ్రీకారం. బిఆర్‌ఎస్‌ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భం. బిఆర్‌ఎస్‌ రజతోత్సవం అంటే పార్టీ పండుగ మాత్రమే కాదు. తెలంగాణ జన జాతర. ఉద్యమ కాలంలో ఎలా అయితే ప్రజలు బిఆర్‌ఎస్‌కు సభలకు బ్రహ్మరధం పట్టేవారో..ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల్లో, బిఆర్‌ఎస్‌ అభిమానుల్లో అదే జోష్‌ కనిపిస్తోంది. అదే ఊపుతో తెలంగాణ మొత్తం వరంగల్‌ వైపు కదులుతోంది. ముఖ్యంగా తెలంగాణ రైతాంగం ఎడ్ల బండ్ల నిండా గులాబీ జెండాలు ఎగరేసుకుంటూ, రెపరెపలాడుతున్న జెండాలతో కొన్ని వేల బండ్లు వరంగల్‌ వైపు జతన్నాధ రధచక్రాలు కదులుతున్నట్లు దూసుకువస్తున్నాయి. తెలంగాణ చైతన్యాన్ని మేలు కొలుపేలా కేసిఆర్‌ రధ చక్రాలుగా రైతులు పరుగులందుకుంటూ వస్తున్నారు. కేసిఆర్‌కు జేజేలు కొట్టుకుంటూ వస్తున్నారు. ఇదీ బిఆర్‌ఎస్‌ అంటే. అదే కేసిఆర్‌ తెలంగాణ ప్రజల్లో చైతన్యమంటే..అదే తెలంగాణ ప్రజలకు కేసిఆర్‌ అందించిన చైతన్యమంటే అంటున్న ఉద్యమ కారుడు, సీనియర్‌ బిఆర్‌ఎస్‌ నాయకుడు, బిఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, నేటి దాత్రి ఎటిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో చెప్పిన రజత్సోవసభ విశేషాలు ఆయన మాటల్లోనే.
..ఉద్యమ కాలంలో ఉరకల్తెని పార్టీ బిఆర్‌ఎస్‌. ఇప్పటికీ బిఆర్‌ఎస్‌ అంటే తెలంగాణలో ప్రజలకు ఒక ఆర్తి. కేసిఆర్‌ అంటేనే ఒక నమ్మకం. ఒక వ ఇశ్వాసం. ప్రజల మేలు కోరే ఏకైక నాయకుడుగా గుర్తింపు వుంది. అయినా తెలంగాణ రాజకీయాల్లో కేసిఆర్‌ను మించిన నాయకుడు లేడు. తెలంగాణ కోసం కొట్లాడిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ సాదన కోసం బిఆర్‌ఎస్‌ పార్టీ పెట్టిన నాయకుడు కేసిఆర్‌. తన రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ వస్తుందో..రాదో తెలియని సమయంలో పిడికిలెత్తి జై తెలంగాణ అని గర్జించిన నాయకుడు కేసిఆర్‌. బిఆర్‌ఎస్‌ పార్టీ పెట్టినా జై తెలంగాణ అంటూ ఎవరు వస్తారో..రారో తెలియని అమోమయ పరిసి ్దతుల్లో బిఆర్‌ఎస్‌ జెండా ఎగరేసిన నాయకుడు కేసిఆర్‌. తర్వాత కొన్ని లక్షల మంది కేసిఆర్‌ను తయారు చేసి, మూడున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల చేత జై తెలంగాణ అని నినదింపజేసిన నాయకుడు కేసిఆర్‌. ఎంత కొట్లాడినా తెలంగాణ రాకపోతే విఫలనాయకుడిగా మిగలడం కన్నా, తెలంగాణ తెచ్చిన నాయకుడుగానే చరిత్రలో నిలవాలన్న సంకల్పంతో అడుగులేసిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. తన చావుతోనైనా తెలంగాణ వస్తుందంటే చావు నోట్లో తలపెట్టేందుకు కూడా ఏ మాత్రం ఆలోచించని గొప్ప నాయకుడు కేసిఆర్‌. కేసిఆర్‌ చచ్చుడో..తెలంగాణ వచ్చుడో అని కఠినమైన నిర్ణయం తీసుకొని ఆమరణ దీక్ష చేపట్టిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ సమాజమంతా వద్దని వారించినా, తెలంగాణ తేకపోతే నా ఉద్యమం వృధా..నేను తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోలేని నాయకుడుగా బతకలేనని నిర్ణయం తీసుకున్న నాయకుడు కేసిఆర్‌. బహుషా ప్రపంచ చరిత్రలోనే కేసిఆర్‌ లాంటి ఉద్యమ కారుడు మరొకరు లేకపోవచ్చు. ఉద్యమాలు చేసిన వాళ్లు ఎందురో వున్నారు. కాని ఫలితం ఆశించకుండా ఉద్యమాలు చేసిన వాళ్లున్నారు. కాని ఫలితమే తెలంగాణ అంతిమ లక్ష్యం కావాలని కొట్లాడిని ఏకైక నాయకుడు కేసిఆర్‌. అందుకే తెలంగాణ సాధించగలిగారు. అంతటి బలమైన సంకల్పాన్ని పూనారు. అంతిమంగా తెలంగాణ సాధించి తెలంగాణ ప్రజల చేతుల్లో పెట్టారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని రెపరెపలాడిరచారు. ఇలాంటి నాయకుడు నిన్నటి తెలంగాణ చరిత్రలో ఎవరూ లేరు. భవిష్యతు తెలంగాణకు అవసరం లేదు. ఎందుకంటే బంగారం లాంటి తెలంగాణను తయారు చేసి కేసిఆర్‌ ఎప్పుడో పెట్టారు. తెలంగాణ తేవడమే కాదు, తెచ్చినతెలంగాణను బంగారు తెలంగాణ చేసిన నాయకుడు కూడా కేసిఆర్‌. ఇలా రెండు రకాల విజయాలను తెలంగాణకు అందించిన గొప్ప పాలకుడు కేసిఆర్‌. ప్రపంచ రాజకీయ ముఖ చిత్రంలోనే కేసిఆర్‌ లాంటి నాయకుడు మరొకరు వుండరు. అందుకే తెలంగాణ అంటేనే కేసిఆర్‌..కేసిఆర్‌ అంటేనే తెలంగాణ..అలా అందమైన, అధ్భుతమైన, పాడి పంటలతో అలరాలుతూ, రైతులు రాజులుగా వర్ధిల్లుతున్న తెలంగాణను ఇప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆగం చేస్తోంది. కేసిఆర్‌ పదేళ్ల పాలనలో రైతులంతా సుఖ సంతోషాలతో వున్నారు. మూడేళ్లలోనే కాళేశ్వరం నిర్మాణం చేసి, తెలంగాణలో ప్రతి మూలన చివరి ఆయ కట్టు వరకు సాగు నీరిచ్చిన అపర భగీరధడు కేసిఆర్‌. తెలంగాణ తెచ్చిన ఆరు నెలల్లోనే మిషన్‌ కాకతీయ తెచ్చి, తెలంగాణలోని చెరువులన్నీటింటికీ పూర్వ వైభవం తెచ్చారు. చెరువులు బాగు చేయించారు. పూర్వం చెరువు ఎలా వుండేదో అలా తీర్చిదిద్దారు. రైతులే స్వయంగా పాలు పంచుకొని, బండ్లల్లో, ట్రాక్టర్లలో చెరువు మట్టి తీసుకెళ్లి, పొలాల్లో చల్లుకున్నారు. నిండిన చెరువు నుంచి ఊటలు మళ్లి, బావులు నిండడంతో సాగును పండుగ చేసుకున్నారు. ఇరవై నాలుగు గంటల కరంటు ఇచ్చి రైతు కష్టం తీర్చాడు. అర్ధరాత్రి, అపరాత్రి ఇచ్చిన కరంటు మూలంగా ఏ ఒక్క రైతు చనిపోకుండా చూసుకున్నారు. ఇరవైనాలుగు గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించడంతో రైతు తన వెసులుబాటును చూసుకొని, అవసరమైన మేరకు పొలానికి నీరు పెట్టుకున్నారు. పదేళ్లు బంగారు పంటలు పండిరచుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ వస్తూ వస్తూనే రైతుకు కష్టం తెచ్చింది. రైతుల కళ్లలో కన్నీరు నింపింది. కాంగ్రెస్‌ కృత్రిమకరువును తెచ్చి రైతను అరిగోస పెడుతోంది. భూగర్భంలో చుక్క నీరు లేకుండా చేయడంతో ఆవిరైతున్న నీళ్లు రైతుకు అందక కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి. తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చిన కాంగ్రెస్‌ ప్రభత్వంపై ఆవిరైతున్న నీళ్లే కన్నెర్ర చేస్తున్నాయి. తెలంగాణలో అడుగుంటున్న భూగర్భజలాలు కాంగ్రెస్‌ పాలకుల మీద ఆక్రోషం వెల్లగక్కుతున్నాయి. ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌..ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌ అంటూ తెలంగాణ ప్రజలను వేడుకుంటే కనికరించి, గెలిపించినందుకు తెలంగాణ తల్లి ఒడిలో చుక్క నీరులేకుండా చేస్తున్నారు. మళ్లీ ఒట్టిపోతున్న వాగులు, వంకలు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి శాపాలు పెడుతున్నాయి. ఎడారిగా మారిన పొలాల బీళ్లు నోరు తెరిచి, కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్వాకాన్ని చూసి నోళ్లు తెరిచి తిడుతున్నాయి. అందుకే కళ్లు మండుతున్న రైతు బిఆర్‌ఎస్‌ రజతోత్సవసభలో ప్రభుత్వంపై సభ స్పూర్తి, సాక్షిగా, మళ్లీ కేసిఆర్‌ పాలన కోసం కంకణం కట్టుకున్నామని చెప్పేందుకు తరలివస్తున్నారు. జై తెలంగాణ నినాదాలు చేసుకుంటూ దండు కట్టి వస్తున్నారు. అలా వస్తున్న రైతులను చూస్తే జనం గుండెల నిండా గులాభీ వనం విరబూసినట్లు కనిపిస్తోంది. కనువిందు చేస్తోంది. బిఆర్‌ఎస్‌ శ్రేణులో సంబురం నింపుతోంది. ఎప్పుడెప్పుడు బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ అని ఎదరుచూసి, అందరూ బయలుదేరుతున్నారు. ఇప్పటికే దూరపు జిల్లాల నుంచి లక్షల మంది రైతులు మూడు రోజుల ముందే భయలుదేరి వస్తున్నారు. మిగతా రైతులు బయలుదేరుతున్నారు. లక్షలాది మంది ప్రజలు వరంగల్‌ నగరానికి చేరుకుంటున్నారు. ఎందుకంటే కేసిఆర్‌ అంటేనే తెలంగాణ జీవం. కేసిఆర్‌ మాటలే తెలంగాణకు వేదం. రజతోత్సవ సభకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించాలని చూశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన ఆ కుట్రలన్నీంటినీ తిప్పి కొట్టి సభ ఏర్పాటు చేసుకుంటున్నాం. బిఆర్‌ఎస్‌ పార్టీ రజత్సోవం అంటే తరతరాలు గర్వంగా చెప్పుకునేలా నిర్వహిస్తాం.. వచ్చే ఎన్నికల్లో కేసిఆర్‌ నాయకత్వానా గులాబీజెండాను ఎగరేస్తాం..బిఆర్‌ఎస్‌కు ఎదురులేదు..కేసిఆర్‌ నాయకత్వానికి తిరుగులేదని ఎలుగెత్తి చాటుతాం…కేసిఆర్‌ కీర్తి ప్రపంచం చెప్పుకునేలా నడుచుకుంటాం.

ఏజెన్సీ ప్రాంతంలో1/70 చట్టానికి అనుగుణంగానే.

ఏజెన్సీ ప్రాంతంలో1/70 చట్టానికి అనుగుణంగానే భూభారతిని చట్టాన్ని అమలు చేయాలి

కొత్తగూడ, నేటిధాత్రి:

 

 

 

ఆదివాసి సంక్షేమ పరిషత్ మహబూబాబాద్ జిల్లా కమిటీ సమావేశం కొత్తగూడ మండల కేంద్రంలో జరిగింది.

ఈ సమావేశంలో కొత్తగూడ మండల నూతన కమిటీని జిల్లా అధ్యక్షులు తాటి సుధాకర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎంపిక చేయడమైనది.

ఆగబోయిన ప్రశాంత్ అధ్యక్షులు, దనసరి నారాయణ ప్రధాన కార్యదర్శి, కంగల సురేందర్, సుంచ బాలరాజు ఉపాధ్యక్షులు కార్యదర్శిలు మోకాళ్ళ చంద్రబాబు దనసరి రాజేష్ (చిన్న), దనసరి రాజబాబు, చింత రాజు కమిటీ సభ్యులు గా ఎన్నుకోవడం జరిగింది అనంతరం ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు తాటి సుధాకర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న కొంతమంది నిరుపేద ఆదివాసి రైతులకు ఇప్పటివరకు అడవి హక్కు పత్రాలు ప్రభుత్వం మంజూరు చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు.

హక్కు పత్రాలు మంజూరు కానటువంటి వారికి ప్రభుత్వం తక్షణమే అడవి హక్కు పత్రాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా వారు కోరినారు.

హక్కు పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వ బ్యాంకుల ద్వారా పెట్టుబడులకు రుణాలు తీసుకోలేని పరిస్థితి దాపురించింది దీంతో నిరుపేద ఆదివాసి రైతులు వడ్డీ వ్యాపారస్తులు ఆశ్రయించి వారి దగ్గర విత్తనాలు ఎరువులు అధిక వడ్డీలకు ఇస్తూ రైతుల్ని దోపిడీ చేయడమే కాకుండా వారు పండించిన పంటని అలా సులాలకు కొన్న వడ్డీ వ్యాపారులు వారు లాభపడుతూ నిరుపేద ఆదివాసి రైతుల జీవితాలను అప్పుల ఊబిలోకి నేడుతున్నారు ఏజెన్సీ ప్రాంతంలోని దళారులు కోట్లకు పరిగెడుతున్నారు నిరుపేద ఆదివాసి రైతులు సేట్ల దగ్గర అప్పు కోసం వరుస కడుతున్నారు ఏజెన్సీ ప్రాంతంలో ఇంత జరుగుతున్నా కూడా వ్యవసాయ శాఖ అధికారులు కళ్ళు మూసుకొని దళారులను ప్రోత్సహిస్తున్నారు ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఆదివాసీల భూములు మొత్తం కూడా వడ్డీ వ్యాపారులు సేట్లకి తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి దాపురిస్తుందని వారు ఆవేదన చెందినారు.

అతికరేట్లకు విత్తనాలు సప్లై చేస్తున్న సేట్లను అధిక వడ్డీకి డబ్బులు ఇస్తున్న వడ్డీ వ్యాపారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా.

ఏజెన్సీ ప్రాంతంలో భూభారతి అవగాహన సదస్సులో గిరిజనేతరుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూముల పైన విచారణ చేపట్టాలని ఆ భూములు 1/70 చట్టం అమల్లో రాకముందు నుండి వారి ఆధ్వర్యంలో ఉన్నాయా అనే విషయాన్ని కూడా ప్రభుత్వం

ఈ అవగాహన సదస్సులో ఏజెన్సీ ప్రాంతంలోని భూములపై కూడా అవగాహన కల్పించాలని అంతేకాకుండా భూభారతి ముసుగులో 1970 సంవత్సరం తర్వాత ఏజెన్సీ ప్రాంతాలకు వలస వచ్చిన గిరిజనేతరాలకు హక్కులు కల్పిస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

 

అదేవిధంగా ఈనెల 27న గంగారం మండలం కమిటీ ఎన్నుకోవడం జరుగుతుందని ఆదివాసి యువకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తాటి ప్రవీణ్ మహాబూబాబాద్ డివిజన్ అధ్యక్షులు ఆదివాసి సంక్షేమ పరిషత్ ధనసరి రమేష్ దనసరీ వినోద్ గట్టి కార్తీక్ చింత సాంబయ్య అలెం సారంగపాణి తదితరులు పాల్గొన్నారు…

కాంగ్రెస్ ఉనికి కోల్పోవడం ఖాయం.!

కాంగ్రెస్ ఉనికి కోల్పోవడం ఖాయం. రజతోత్సవసభ తో

భారత రాజకీయాల్లో రజితోత్సవ సభ చారిత్రాత్మకం

గండ్ర యువసేన జిల్లా నాయకులు

గడ్డం రాజు.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

మండలకేంద్రంలో గండ్ర యువసేన జిల్లా నాయకులు గడ్డం రాజు మొగుళ్ళపల్లిలొ జరిగిన పాత్రికేయుల సమావేశంలొ రజతోత్సవ సన్నాహక సమావేశంను ఉద్దేశించి రాష్ట్రంలో ఉనికిని కోల్పోవడం ఖాయమని అన్నారు. ఆయన మట్కాడుత
ఏప్రిల్ 27న వరంగల్ లో జరిగే రజతోత్సవ సభకు సమాయత్తం చేయడం కొరకు పర్యటన చేస్తున్నానాని రజతోత్సవ సభకు ప్రజలు నాయకులు కార్యకర్తలు వస్తున్నారని భారత రాజకీయ చరిత్రలో ఈ సభ చారిత్రాత్మక అవుతుంది అన్నారు.కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదని గడ్డం రాజు ఆవేదన వ్యక్తంచేశారు ప్రజాసంక్షేమం గాలికి వదిలేసి ప్రజలను గోసా పడుతున్నారని స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు మొగుళ్ళపల్లి మండలం నుంచి అధిక సంఖ్యలో విజయోత్స సభకు పాల్గొనాలని గడ్డం రాజు పిలుపునిచ్చారు.

డెంగ్యూ, మలేరియాను నియంత్రించాలి.

డెంగ్యూ, మలేరియాను నియంత్రించాలి:
ఎంటమాలజి :ఏ ఈ వనజ

మల్కాజిగిరి నేటిధాత్రి

 

 

 

మలేరియా దినోత్సవం సందర్భంగా మల్కాజ్ గిరి సర్కిల్ ఎంటమాలజీ విభాగం సర్కిల్ ఏఈ వనజ ఆధ్వర్యంలో సఫిల్ గూడ నుంచి ఆనంద్ బాగ్ చౌరస్తా వరకుర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ..

Surroundings Clean

 

దోమల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని డెంగ్యూ, మలేరియాను నియంత్రించాలని సూచించారు. అనంతరం ప్రజలకు డెంగ్యూ, మలేరియా వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు గురు భూషణ్, నాగేందర్ , షోకత్ , రామచందర్, ఎండి అబ్దుల్ , సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ZPHS కారుకొండ

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ZPHS కారుకొండ.

హన్వాడ:- నేటి దాత్రి.

మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట్ మండలం కారుకొండ గ్రామంలోని పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2014-2015 బ్యాచ్.ఏప్రిల్ 20-2025 న.తమ 10 సంవత్సరాల వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తమ తీపి జ్ఞాపకాలను పంచు కున్నారు. ప్రతి ఒక్క విద్యార్థి తమ ఉపాధ్యాయులని గుర్తుచేసుకొని ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు.

ఓరుగల్లు మహా సభను విజయవంతం చేద్దాం.

ఓరుగల్లు మహా సభను విజయవంతం చేద్దాం

బిఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు గంట కళావతి

పరకాల నేటిధాత్రి

ఊరు వాడా ఉప్పెనలా కదులుదాం ఓరుగల్లు మహా సభను విజయవంతం చేద్దాం అని పరకాల పట్టణ బిఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు గంట కళావతి పిలుపునిచ్చారు.27న వరంగల్ ఎల్కతుర్తిలో జరుగుతున్న బిఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబి సైనికులు కదిలి రావాలని కోరారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి కనీ విని ఎరుగని రీతిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పరకాలను అభివృద్ధి చేశారని తెలిపారు. అలాంటి అభివృద్ధి ప్రదాత ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లాలో బిఆర్ఎస్ రజతోత్సవ సభను ఈ నెల 27న నిర్వహిస్తున్నారని ఆ సభకు ప్రతి ఒక్కరు వచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.

ఉగ్రవాదులను తుది ముట్టించాలి.

ఉగ్రవాదులను తుది ముట్టించాలి

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని పహల్గామ్ లో జరిగిన దాడి దురదృష్టకరమని అమాయకులైన 26 మందిని బలిగొన్న ఉన్మాదులను తుది ముట్టించాలని సిరిసిల్ల మజీద్ కమిటీ నాయకులు కేంద్ర ప్రభుత్వన్ని కోరారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణంలో మజీద్ కమిటీ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.
పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మజీద్ కమిటీ నాయకులు మాట్లాడుతూ భారత దేశంలో అన్నదమ్ములల కలిసి మెలిసి ఉన్న హిందూ ముస్లింలలో వైశాల్యాలు సృష్టించి లేనిపోని అపోహలు కల్పించి దేశంలో కునుకు లేకుండా ఉగ్రదాడులు చేస్తున్నారని అన్నారు. పహల్గామ్ లో అమాయకులైన 26 మందిని బలిగొన్నారని అమాయకులైన వారి ప్రాణాలను బలిగొన్న ఉన్మాదులను తుది ముట్టించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో
మజీద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ సమీద్, రఫీ ఉద్దీన్, షాబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం

ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం

కరీంనగర్, నేటిధాత్రి:

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ సీపీఐ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కమాన్ చౌరస్తా వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఉగ్రవాదుల దుర్మార్గపు చర్యల వల్ల అమాయక ప్రజలు, పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, ఉగ్రవాదులను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందినదని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఆరోపించారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, టేకుమ్మ సమ్మయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కిన్నెర మల్లవ్వ, పిట్టల సమ్మయ్య, బీర్ల పద్మ, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, బ్రామండ్లపెల్లి యుగేందర్, బోనగిరి మహేందర్, నలువాల సదానందం, సాయవేణి రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version