జూన్ 3 నుంచి 16 వరకు భూభారతి రెవెన్యూ సదస్సులు.

జూన్ 3 నుంచి 16 వరకు భూభారతి రెవెన్యూ సదస్సులు.

బాలానగర్ నేటి ధాత్రి:

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని వివిధ గ్రామపంచాయతీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంపై రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి గురువారం తెలిపారు. ఈనెల 3న పెద్దాయపల్లి మరియు కేతిరెడ్డిపల్లి, 4న బాలానగర్ మరియు బోడ జానంపేట, 5న చిన్న రేవల్లి మరియు పెద్ద రేవల్లి, 6న నేరళ్ల పల్లి మరియు మోతి ఘనపూర్, 9న గుండేడ్ మరియు ఉడిత్యాల, 10న హేమాజీ పూర్ మరియు తిరుమలగిరి, 11న మొదంపల్లి మరియు సూరారం, 12న నందారం, నామ్యతాండ, లింగారం, సేరిగూడ, 13న గౌతాపూర్ మరియు అప్పాజీపల్లి, 16న మాచారం గ్రామాలలో.. ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో రైతు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తహసిల్దార్ అన్నారు.

చంద్రమౌళి ఆత్మకు శాంతి చేకూరాలి.

చంద్రమౌళి ఆత్మకు శాంతి చేకూరాలి

జైపూర్ నేటి ధాత్రి:

జన్నారం ఇంధనపల్లి మండలం వన్ గ్రామపంచాయతీ కార్యదర్శి ఎర్రజుల చంద్ర మౌళి బుధవారం రోజున ఆకస్మికముగా గుండె పోటుతో మరణించడం చంద్రమౌళి మృతికి సంతాపాన్ని ప్రకటిస్తూ గురువారం రోజున జైపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 2 నిముషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తోటి అధికారి అకస్మాత్తుగా స్వర్గస్తులవడం బాధాకరమైన విషయమని, ఎర్రాజుల చంద్రమౌళి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ సత్యనారాయణ గౌడ్,ఎంపీవో శ్రీపతి బాబురావు,ఆర్డబ్ల్యూఎస్ డిఈ,మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది,జైపూర్ మండలం పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీలో జిల్లా ఫస్ట్.

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీలో జిల్లా ఫస్ట్

జిల్లా కలెక్టర్ కు మంత్రుల అభినందనలు

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీలో రాజన్న సిరిసిల్ల జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా అధికారులను మంత్రులు అభినందించారు.
జిల్లాకు మంజూరు అయిన 7862 ఇండ్లకు గాను 7808 అలాట్మెంట్ ఆర్డర్లు లబ్దిదారులకు అందజేశారు. వేములవాడ నియోజకవర్గంలో ఫేజ్-1,2 లో కలిపి 2575 ఇండ్లు, సిరిసిల్ల నియోజకవర్గంలో ఫేజ్-1,2 లో కలిపి 3608 ఇండ్లు, చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండలంలో ఫేజ్-1,2 లో కలిపి 820 ఇండ్లు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యంతో కలిసి, మానకొండూర్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలంలో ఫేజ్-1లో 42 ఇండ్ల మంజూరు పత్రాలు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి కలెక్టర్ పంపిణీ చేశారు. ఫేజ్- 2లో 763 మంజూరు పత్రాలు ఇవ్వనున్నారు. ఫేజ్ 1 కింద జిల్లాలో మొత్తం 439 ఇండ్లు మంజూరు చేయగా, 135 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి. జిల్లాలోని 11 మండలాల్లో మొదలు పెట్టిన మోడల్ హౌస్ లలో బేస్మెంట్ లెవెల్ లో మూడు, రూఫ్ లెవెల్లో రెండు, స్లాబ్ లెవెల్ లో ఆరు ఇండ్లు ఉన్నాయి.ఈ సందర్బంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశాన్ని కరీంనగర్ లో గురువారం నిర్వహించగా, జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు హాజరై ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల జారీలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేలా విశిష్ట సేవలు అందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ను, జిల్లా అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.

ఆర్డర్ తో భాద్యతలు చేపట్టిన సుకినే రాజేశ్వర్ రావు..

హైకోర్టు ఆర్డర్ తో భాద్యతలు చేపట్టిన సుకినే రాజేశ్వర్ రావు..

సొసైటి చైర్మన్ ను సన్మానించిన పలువురు నాయకులు..

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పదవీకాలం గత మూడు నెలల క్రితం ముగియడంతో సహకార సంఘాల ఎన్నికలు నిర్వహణ చేయలేకపోయిన
ప్రభుత్వం మరల అదే పాలకవర్గాన్ని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.కాగా దుగ్గొండి మండలంలోని నాచినపల్లి పీఏసీఎస్ చైర్మన్ గా ఉన్న బిఆర్ఎస్ పార్టీకి చెందిన
సుకినే రాజేశ్వర్ రావు మాత్రం భాద్యతలు ఇవ్వలేదు.దీంతో నర్సంపేట డివిజన్ పరిధిలో గల బిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు సొసైటీల చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించారు.దీంతో వీరి వాదనలు విన్న హైకోర్టు మరల బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర,జిల్లా సహకార అధికారులకు ఉత్తర్వుల జారీ చేసింది.
కాగా గురువారం సుకినే రాజేశ్వర్ రావు ఇంచార్జీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ నాచినపల్లి వ్యవసాయ సహకార సంఘ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ రైతులకు అందుబాటులో ఎరువులను అందించే విషయంలో ముందుంటామన్నారు. రైతులకు సంబంధించి క్రాఫ్ లోన్స్ ఇవ్వడం జరిగిందన్నారు. గతంలో సి. గ్రేడ్ ఉన్న సహకార సంఘాన్ని ఏ. గ్రేడ్ కు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.డైరెక్టర్ల సహకారంతో రైతుల సహకారంతో అన్ని విధాల అభివృద్ధి చేయడం జరిగిందని రాజేశ్వర్ రావు తెలిపారు.
బాధ్యతలు చేపట్టిన రాజేశ్వర్ రావు ను మాజీ జెడ్పిటిసి వడ్డేపల్లి చంద్రమౌళి, మాజీ చైర్మన్ గుడిపల్లి జనార్దన్ రెడ్డి,మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు మాజీ డైరెక్టర్లు గొర్రె జనార్దన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శివాజీ నగర్ గ్రామ పార్టీ అధ్యక్షులు బొరాల లింగయ్య తిమ్మంపేట గ్రామ పార్టీ అధ్యక్షులు గొర్రె జనార్దన్ రెడ్డి,నా చినపల్లి గ్రామ అధ్యక్షులు నర్రా రంగారెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిశారు.ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు నల్ల శ్యాంసుందర్ రెడ్డి, గొసంగి పురుషోత్తం, మెరుగు రాజు, తుమ్మలపెల్లి సదానందం, హనుమకొండ లలిత బాబు, సాంబయ్య,సురావు సంజీవరావు, మోకిడే ప్రభాకర్, నరహరి భాస్కర్ రెడ్డి పలువురు రైతులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలు ప్రజా ప్రతినిధులు పరిష్కరించాలి.

ప్రజా సమస్యలు ప్రజా ప్రతినిధులు పరిష్కరించాలి

లేనిచో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి అభ్యర్థులను పోటీ చేయిస్తాం

వనపర్తి బి సి ల జన బేరి బహిరంగ సభలో రాచాల యుగేందర్ గౌడ్
వనపర్తి నేటిధాత్రి:

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నామినేటెడ్ పదవుల్లో బీసీలకు అన్యాయం జరిగిందని జిల్ల లో అవినీతిపై బీసీల ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని బీసీ పొలిటికల్ జే ఏ సీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ వనపర్తి లో రాజావారి పాలిటెక్నిక్ కళాశాల మైదానం బి సి జన బేరి బహిరంగ సభలో బీ సీ లను ఉద్దేశించి ప్రసంగించారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు స్థానిక ప్రజల సమస్యలు పట్టించుకోకుంటే అధికారపార్టీపై బీసీల మద్దతుతో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల లో మున్సిపాలిటీ జెడ్పిటిసి సర్పంచ్ ఎన్నికలలో బీ సీ ల అభ్యర్థులను పోటీ చేయిస్తామని రాచాల పేర్కొన్నారు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బీసీలు భారీ ఎత్తున పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేసినందుకు రాచాల కృతజ్ఞతలు తెలిపారు

ట్రాక్టర్ మీది నుండి పడి యువకుడు మృతి.

ట్రాక్టర్ మీది నుండి పడి యువకుడు మృతి.

కల్వకుర్తి /నేటి ధాత్రి

 

ప్రమాదవశత్తు ట్రాక్టర్ మీద నుండి పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని తుర్కలపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చెందిన సాయిబాబ (20) ట్రాక్టర్ తో పొలం దున్నుతుండగా.. ప్రమాదవశత్తు కిందపడి మృతి చెందాడు. సాయిబాబకు ఏడాది క్రితం వెల్దండ మండలం, రాచూరు గ్రామానికి చెందిన ఓ యువతీతో పెళ్లయింది. చిన్న వయస్సులోనే మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ప్రమాదం సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వనపర్తి జిల్లా లోఇసుక రిచులను గుర్తించాలి.

వనపర్తి జిల్లా లోఇసుక రిచులను గుర్తించాలి

జిల్లాకలెక్టర్ ఆదర్శ్ సురబీ అధికారులకు ఆదేశాలు

వనపర్తి నేటిధాత్రి:

ఇసుక వాహనం ద్వారా గృహ నిర్మాణాలకు ఇసుక అందించేందుకు వనపర్తి జిల్లాలో ఇసుక రీచులను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు గురువారం కలెక్టర్ చాంబర్ లో జిల్లాస్థాయి సాండ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు వనపర్తి జిల్లాలో కొత్తగా ఎక్కడెక్కడ ఇసుక రీచ్ లు గుర్తించారు వాటి భౌగోళిక పరిస్థితులు ఏంటి అనేది అధికారులతో చర్చించారు
తుంపల్లి గ్రామం వీరరాఘవపూర్ ఇసుక రీచ్ లో 3990 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉందని ఇరిగేషన్ భూగర్భ జలాలుమైన్స్ అండ్ జియాలజి ద్వారా పరిశీలన చేసిన రిపోర్టును కలెక్టర్ ముందు ఉంచారు వీర రాఘవపూర్ రీచ్ నుండి మన ఇసుక వాహనం ద్వారా ఇసుక తీసుకునేందుకు కమిటీ తీర్మానం చేసింది .మదనపూర్ మండలములోని కొత్తపల్లి దుప్పల్లి రీచులను పరిశీలించడం జరిగిందని అక్కడ నిబంధనలకు అనుగుణంగా ఇసుక లభ్యత లేదని మైన్స్ అధికారి తెలుపగా ఆన్లైన్ మ్యాప్ ద్వారా పరిశీలించిన కలెక్టర్ కమిటీ సభ్యులు మరో సారి క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. పెద్దమందడి మండలం చిలకటోనీ పల్లి కర్వేన గ్రామాల్లోనీ రీచులను పరిశీలించడం జరిగిందని అక్కడ నిబంధన ప్రకారం ఉండాల్సిన ఇసుక లభ్యత లేదని అందువల్ల రీచ్ గా పరిగణించి ఇసుక తీసుకోలేమని కమిటీ నిర్ధారించింది అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు ఎ డిమైన్స్ గోవిందరాజులు భూగర్భ జలాల ఎ డి దివ్యజ్యోతి డి ఎల్పీఒ రఘునాథ్ ఇరిగేషన్ శాఖ అధికారి పాల్గొన్నారు

జీవిత భీమా వారి వరల్డ్ రికార్డ్ పురస్కారం.

జీవిత భీమా వారి వరల్డ్ రికార్డ్ పురస్కారం అందుకున్న పరమేశ్వర్ పాటిల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మెదపల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ .జీవిత భీమా సంస్ధ నుండి అరుదైన గౌరవ పురస్కారం అందుకున్నారు ఆయన ఈసందర్భంగా మాట్లాడుతూ .జీవిత భీమా ద్వారా ప్రతి కుటుంబానికి పొదుపు చేయడం నేర్పడం.మరియు ప్రమాద బీమా ని అందించడం .ఆరోగ్యబీమాను అందించడం తనకు ఎంతగనో సంతృప్తి ఇస్తుంది అని అన్నారు .అనుకోకుండా జరిగే ప్రమాద ల వల్ల ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నం అయ్యాయి అందుకే ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు జీవిత భీమా ను తీసుకొని కుటుంబ భద్రతను కాపాడుకోవాలి అని అన్నారు.

నూతన తహసిల్దార్ ను కలిసిన రైతు సంఘం నాయకులు.

నూతన తహసిల్దార్ ను కలిసిన రైతు సంఘం నాయకులు.

నడికూడ నేటిధాత్రి:

మండలంలోని తహసిల్దార్ గా నూతనంగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన గుజ్జుల రవీందర్ రెడ్డి ని తెలంగాణ రైతు రక్షణ సమితి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.మండల వ్యాప్తంగా ఉన్న రైతు సమస్యలను తహసిల్దార్ దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వివిధ విభాగాల అధికారులతో చర్చించి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.అనంతరం తహసిల్దార్ కు,శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు.ఈ కార్యక్రమంలో మండలంలోని అధ్యక్షులు వాంకే రాజు,ఆరె సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు లోకేటి నగేష్,యూత్ నాయకులు నారగాని రాకేష్ గౌడ్,లోనే సతీష్ తదితరులు పాల్గొన్నారు.

ఒలిమా డిన్నర్ లో పాల్గొన్న పాల్గొన్న రాజకీయ నాయకులు.

ఒలిమా డిన్నర్ లో పాల్గొన్న పాల్గొన్న రాజకీయ నాయకులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

మహమ్మద్ ఇమ్రాన్ తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ రిపోర్టర్ సోదరుని రిసెప్షన్ కి జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండల్ భారత్ ఫంక్షన్ హాల్లో సజ్జాపూర్ గ్రామానికి చెందిన మొహమ్మద్ మగ్దూం కుమారుని వలిమా డిన్నర్ వైభవంగా జరుగగా పలువురు రాజకీయ నాయకులు హాజరైయ్యారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేటర్ చైర్మన్ వై నరోత్తం,టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్,మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్,బిజీ సందీప్,షికారి గోపాల్,కోహిర్ మండల్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు,కాంగ్రెస్ నాయకులు కోహిర్ మండల్ ఎంపీపీ షాకీర్ ,ప్రసాద్ రెడ్డి,గొల్ల భాస్కర్,, మొహమ్ వాజీర్ అల్లి ,మాజీ బాల్ నగర్ కార్పొరేటర్ నసీర్ మన తెలంగాణరిపోర్టర్ షకీల్ అహ్మద్, జేజే జావిద్ మాజీ సర్పంచ్లు మాజీ జెడ్పిటిసిలు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

టీ వై జె ఎఫ్ ఆధ్వర్యంలో నూతన డీఎస్పీ కి ఘనంగా సన్మానం.

టీ వై జె ఎఫ్ ఆధ్వర్యంలో నూతన డీఎస్పీ కి ఘనంగా సన్మానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి నూతనంగా వచ్చిన డీఎస్పీ సైద్ నాయక్ ఇటీవల బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా జహీరాబాద్ తెలంగాణ యూత్ జర్నలిస్టు ఫెడరేషన్ (టి వై జె ఎఫ్) అధ్యక్షుడు చెల్మెడ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు . ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ ఇంత మంచి ఆఫీసర్ జహీరాబాద్ ప్రాంతానికి రావడం శుభ పరిణామం అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ టీ వై జె ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ బి. నగేష్ , జనరల్ సెక్రెటరీ ప్రకాష్ కుమార్, టీ వై జె ఎఫ్ ట్రెజరీ మహేష్ కుమార్, కోఆర్డినేటర్ కె అశోక్ కుమార్, కోఆర్డినేటర్ రాములు, ఝరాసంగం టీవైజెఎఫ్ అధ్యక్షుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

విత్తనాల దుకాణాల్లో పోలీసుల తనిఖీ.

విత్తనాల దుకాణాల్లో పోలీసుల తనిఖీ

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా)నేటిధాత్రి:

 

గుండాల పోలీసు స్టేషన్ సిఐ రవీందర్, ఎస్సై సైదా రహూఫ్ ఆధ్వర్యములో వ్యవసాయ అధికారితో కలసి గుండాల లో ఉన్న సీడ్స్,ఫర్టిలైజర్ షాపులపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రవీందర్ మాట్లాడుతూ సీడ్స్, ఫర్టిలైజర్స్ షాప్ యజమానులు నిబంధనలకు లోబడి వ్యాపారాలు చేసుకోవాలని, నకిలీ, కల్తీ విత్తనాలు,ఎరువులు సరఫరా చేసి రైతులను మోసం చేస్తే కఠినమైన చర్యలు తప్పవు అని అన్నారు. నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించాలని వ్యవసాయాన్ని బలోపేతం చేయాలని అన్నారు. కల్తీ విత్తనాలు విక్రయించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులు అనుమతి లేని విత్తన విక్రయాదారులవద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న విత్తన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయలని, తప్పనిసరిగా కొనుగులుకు సంభందించి రశీదు అడిగి తీసుకోవాలని తెలిపారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే వెంటనే సంబంధిత వ్యవసాయ అధికారులకు, పోలీస్ స్టేషన్ కు తెలపలన్నారు.

ఆదర్శంగా నిలుస్తున్న గురిజాల గ్రామ దంపతులు.

కుమార్తె పుట్టినరోజున జి.పి సిబ్బందికి రేమాండ్స్ దుస్తుల అందజేత

ఆదర్శంగా నిలుస్తున్న గురిజాల గ్రామ దంపతులు

నర్సంపేట నేటిధాత్రి:

ఎన్నో సంవత్సరాల నుండి నిత్యం గ్రామానికి నిస్వార్ధంగా సేవ చేస్తున్న నర్సంపేట మండలం గురిజాల గ్రామానికి చెందిన గ్రామ పంచాయితీ సిబ్బందిలో ఒకరైన కడగండ్ల నర్సయ్య (చిన్ని)కి ఆర్టీసీ ఉద్యోగి, గ్రామ ఉద్యోగుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు గొలనకొండ వేణు, చైతన్య ప్రథమ కుమార్తె గొలనకొండ సహస్ర పుట్టినరోజును పురస్కరించుకొని మే 29న గురువారం నర్సయ్య(చిన్ని)కి విలువైన రేమాండ్స్ దుస్తులను సహస్ర చేతుల మీదుగా శ్రీ రామలింగేశ్వర హనుమాన్ ఆలయంలో అందించి ఆదర్శంగా నిలిచారు.గత నాలుగు నెలల క్రితం జనవరి 30న వేణు, చైతన్య దంపతుల కుమారుడు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా గురిజాల గ్రామ పంచాయితీ సిబ్బందికీ జీవితాంతం పట్టు చీరలు, రేమాండ్స్ దుస్తులను తమ ముగ్గురు పిల్లల పుట్టిన రోజున అందించడానికి గ్రామంలో తొలి సారిగా ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అక్టోబర్ 10న తమ కనిష్ట కుమార్తె ఆరాధ్య పుట్టినరోజున కూడా మరో మహిళా పంచాయితీ సిబ్బందికి పట్టుచీర అందజేస్తామని వేణు చైతన్య, దంపతులు తెలిపారు. తమ సేవలను గుర్తించినందుకు గాను గ్రామ పంచాయితీ సిబ్బంది వేణును శాలువాతో సత్కరించారు.

జర్నలిస్టుల జాతర ను విజయవంతం చేద్దాం.

జర్నలిస్టుల జాతర ను విజయవంతం చేద్దాం.

జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవ సభ కు పెద్ద సంఖ్యలో తరలిరావాలి.

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వాల్పోస్టర్ ఆవిష్కరణ.

“నేటిధాత్రి”,వేములవాడ.

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పురుడు పోసుకున్న తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవాలను జయప్రదం చేద్దామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (H143) రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాజన్న సిరిసిల్ల అధ్యక్షులు లాయక్ పాషా పిలుపునిచ్చారు.

వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆవిర్భవించి మే 31వ తేదీతో 25 వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా హైదరాబాద్ జలవిహార్ లో నిర్వహిస్తున్న సంబరాల సభ కు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తల్లి రావాలని కోరారు.

Journalists’

 

తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నిర్వహించిన చారిత్రాత్మక పాత్రను తెలియజేయడం కోసం మే 31న టీజేఎఫ్ రజతోత్సవాలను నిర్వహిస్తుందని తెలిపారు.

తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు నినాదం తో 2001 మే 31న ఆవిర్భవించిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు 2014 వరకు అన్ని వర్గాల ప్రజలను,ఉద్యమ సంఘాలను సంఘటితం చేసిన ఘనత టీజేఎఫ్ అల్లం నారాయణ లతో పాటు యావత్ తెలంగాణ జర్నలిస్టుల కృషి అని గుర్తు చేశారు.

ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవ సంబరాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి జిల్లా నుండి జర్నలిస్ట్ లు అధిక సంఖ్యలో తరలివచ్చి జర్నలిస్టుల జాతరను విజవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, ప్రధాన కార్యదర్శి ఆయాచితుల జితేందర్, ఉపాధ్యక్షులు సయ్యద్ అలీ, జిల్లా రమేష్, దేవరాజ్, ప్రచార కార్యదర్శి షేక్ రియాజ్, కోడం గంగాధర్, హరీష్, విష్ణు, రాజేందర్, వెంకటేష్, ఇమ్రాన్, ఫహద్ పాషా, సల్మాన్, శ్యామ్, షోయబ్ లతోపాటు కార్యవర్గం సభ్యులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల సన్మానం.

‘సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల సన్మానం’

మహబూబ్ నగర్ నేటి ధాత్రి:

మహబూబ్ నగర్, జడ్చర్ల సమీపంలోని చిట్టిబోయిన్ పల్లి దగ్గర 41.02 ఎకరాలలో ట్రిపుల్ ఐటీ కళాశాల మంజూరు చేసిన నేపథ్యంలో గురువారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి,G మధుసూదన్ రెడ్డి, మెఘారెడ్డి, పర్ణిక రెడ్డిలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. దేశంలోనే వెనుకబడిన జిల్లాగా పేరుపొందిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఐఐఐటీ మంజూరు కావడం హర్షనీయమన్నారు. వలస జిల్లా పేరునుండి.. విద్యాభివృద్ధి చెందిన జిల్లాగా పేరు రానున్నదని ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేశారు.

వర్ధన్నపేట నియోజకవర్గనికి ఇంటి గ్రేటెడ్ స్కూల్ మంజూరు.

వర్ధన్నపేట నియోజకవర్గనికి ఇంటి గ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసిన సందర్భంగా

సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు చిత్రాపటాలకి క్షీరాభిషేకం చేసిన వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు

వర్ధన్నపేట( నేటిదాత్రి ):

పట్టణ కేంద్రం లోని అంబేద్కర్ చౌరస్తాలోపట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు,
వర్ధన్నపేట నియోజకవర్గానికి 200 కోట్లతో అత్యధిక నిధులతో సదుపాయాలతో కూడిన స్కూలును మన కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేయడం గర్వకారణం అన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధించడంల ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు కృషి ఫలితమే నిదర్శనం అన్నారు. అత్యధిక వసతులతో కూడిన ఈ ప్రాజెక్టు మన నియోజకవర్గానికి రావడం గర్వకారణం అన్నారు. ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మంచి బంగారు భవిష్యత్తు ప్రణాళికను రూపొందించడంతోపాటు విద్యాభివృద్ధికి, తోడ్పాటును అందించడం జరుగుతుందన్నారు. చదువుకుంటేనే భవిష్యత్తులో ప్రతిది మనం సాధించుకోగలుగుతాం అన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి నిరుపేద కుటుంబానికి అందించడంలో ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరకుడు వెంకటయ్య,
కాంగ్రెస్ పట్టణ మండల అధ్యక్షులు, మైస సురేష్, ఎద్దు సత్యనారాయణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోశాల వెంకన్న, మహమ్మద్ అప్సర్ కర్ర మాలతి రెడ్డి,
వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు,పార్టీ యూత్, మరియు ,
కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….

భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ని దర్శించుకున్న.!

భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ని దర్శించుకున్న అంబటి వీరభద్రo గౌడ్

కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వీరభద్రం గౌడ్

మరిపెడ కురవి నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గo లో ని ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి కొరవి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ని తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు, ఆలయ ఆవరణలో పూజారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దర్శనం చేసుకున్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని నియోజకవర్గంలో ఏనలేని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని,రైతులు అందరూ పాడి పంటలు సమృద్ధిగా పండి అభివృద్ధి పథంలో నడవాలని ముఖ్యంగా డోర్నకల్ నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ కు మంత్రి పదవి రావాలని కొరవి భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నామన్నారు “ప్రతి ఒక్కరూ సంప్రదాయాలను పాటిస్తూ ఆలయాలను దర్శించడం ద్వారా ఆధ్యాత్మిక శాంతిని పొందాలి,” అని అన్నారు. ప్రజల సంక్షేమం మరియు మండల అభివృద్ధి కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

పోచమ్మ ఆలయంలో నీ పోతలింగేశ్వర స్వామి.

పోచమ్మ ఆలయంలో నీ పోతలింగేశ్వర స్వామి విగ్రహం ధ్వంసం

ఓదెల(పెద్దపల్లి జిల్లా):

ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో 28వ రైల్వే గేట్ దగ్గర పోచమ్మ తల్లి దేవాలయంలో పోతలింగేశ్వర స్వామి విగ్రహాన్ని బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆ స్థలాన్ని పరిశీలించి ఆ సంఘటన హిందువులకు చాలా బాధాకరమైన సంఘటన కావున హిందూ సంఘాల ఆధ్వర్యంలో రోడ్డుపై రాస్తారోక నిర్వహించిడం జరిగింది. విషయం తెలుసుకున్న పోత్కపల్లి ఎస్సై ధీకొండ రమేష్ సిబ్బందితో పాటు సంఘటన స్థలానికి చేరుకుని ధర్నా చేస్తున్న వారితో మాట్లాడుతూ విగ్రహాన్ని పరిశీలించి త్వరలోనే ఈ సంఘటన కు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తామని తెలియజేసి ట్రాఫిక్ ను క్లియర్ చేయడం జరిగింది.

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే.

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఉత్తం గార్డెన్స్ లో జరిగిన విట్టునాయక్ తాండా కి చెందిన కేశు సింగ్ గారి కుమారుడి .వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూ వరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మండల పార్టీ జనరల్ సెక్రటరీ గోపాల్, మాజి ఎంపీటీసీ చందు ,చందర్ పవార్,నరేష్, సంజు తదితరులు .

వర్గ పోరాటాలను ఉధృతం చేయాలి.

వర్గ పోరాటాలను
ఉధృతం చేయాలి

శిక్షణ తరగతులు
ముగింపు సమావేశంలో

సిపిఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యు లు వీరయ్య

మరిపెడ నేటిధాత్రి:

కమ్యూనిస్టు కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్య ఉండాలని వారి కోసమే జీవించాలని ,పాలకవర్గాలు ప్రజా వ్యతిరేక విధానాలను వారు చేస్తున్న తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ నిలదీస్తూ వర్గ పోరాటాలను ఉదృతం చేయాలని సిపిఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య అన్నారు. మహబూబాద్ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రంలోని స్థానిక కనకదుర్గ ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న గురువారం 5 వ రోజు జిల్లా స్థాయి శిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో వీరయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కమ్యూనిస్టు పోరాటం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. వారికి మేము ఉన్నామని ప్రజలకు భరోసా కల్పించాలన్నారు.

-ఇచ్చిన హామీలు
అమలు చేయాలి

జిల్లా కార్యదర్శి
సాదుల శ్రీనివాస్

గత ఎన్నికల ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఆశ చూపెడుతూ లబ్ధిదారులను గందరగోళానికి గురి చేస్తున్నాయన్నారు. అర్హులైన పేదలకు ఇల్లు రాకుండా చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అర్హులైన వారికి ఇండ్లు ఇవ్వకపోతే ప్రభుత్వ భూములు పేదల గుడిసెలు వేసి సిపిఐ (ఎం) పార్టీ ఇండ్లు నిర్మిస్తుందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి కార్యవర్గ సభ్యులు సూర్నపు సోమయ్య గునుగంటి రాజన్న, ఆకుల రాజు, కుంట ఉపేందర్, కందనూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి మధుసూదన్, రాజన్న, , లచ్చయ్య, రాజశేఖర్, ఉప్పలయ్య, తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version