అరూరికి మంత్రి పదవి ఇవ్వాలి…

ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌కు మంత్రి పదవి కేటాయించాలని తెలంగాణ వికలాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జన్ను రాజు కోరారు. గురువారం వర్థన్నపేట మండలకేంద్రంలో తెలంగాణ వికలాంగుల ఫోరం ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా టివిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జన్ను రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగుల అపద్భాంధువు, బడుగు, బలహీనవర్గాల సంక్షేమంకోసం నిరంతరం కషి చేస్తు, నియోజకవర్గంలో నిత్యం ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలు తన సమస్యలుగా భావించే వారిని, దాదాపు రెండువేలకు పైగా నిరుద్యోగ యువత, యువకులకు ఉచిత శిక్షణ, ఉచిత భోజన, వసతి, పుస్తకాలు, రవాణా కోసం ఉచిత బస్‌పాస్‌ ఇప్పించిన ఘనత గట్టుమల్లు ఫౌండేషన్‌ ద్వారానే సాధ్యమైందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోనే ఎస్సీవర్గంలో బలమైన మాదిగవర్గానికి చెందిన అరూరి రమేష్‌కి రెండవ విడత మంత్రివర్గ విస్తరణలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అరూరి రమేష్‌కి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. రెండుసార్లు దాదాపుగా లక్ష మెజారిటీతో విజయం సాధించిన ఘనత, ఇటీవల కాలంలో వరంగల్‌ ఎంపి ఎన్నికల్లో భారీ మెజారిటీని అందించిన ఎమ్మెల్యే రమేష్‌ని మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇస్తే వర్ధన్నపేట నియోజకవర్గ అభివద్ధికి, ప్రజలకు మరింత సేవా చేసుకునే భాగ్యం ముఖ్యమంత్రి కేసిఆర్‌, కేటిఆర్‌ కల్పిస్తారని, త్వరలో తెలంగాణ వికలాంగుల ఫోరం బందంతో కేసిఆర్‌కు వినతిపత్రం అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టివిఎఫ్‌ రాష్ట్ర నాయకులు పిన్నింటి రవీందర్‌రావు, రావుల వెంకట్‌రెడ్డి, అడెపు సోమయ్య, వీరయ్య, సతీష్‌, సారయ్య, సంధ్య, రజనీ, ఎల్లయ్య, రాజయ్య, రమేష్‌, కుమార్‌, దివ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *