arpatlanu parishilinchina sp, ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపిటిసి రెండవ విడత ఎన్నికల సందర్బంగా జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే తంగళ్లపల్లి గ్రామ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన ఎన్నికల పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రం వద్ద పోలీస్‌ బందోబస్తు ఏర్పాట్లను, పోలింగ్‌ సరళిని పరిశీలించారు. అదేవిధంగా ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎన్నికలు ప్రశాంతవాతావరణంలో నిర్వహించాలన్నారు. ఎస్పీ వెంట సిరిసిల్ల రూరల్‌ సీఐ అనిల్‌కుమార్‌ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *