ఘనంగా ఏఐటీయూసీ వ్యవస్థాపక దినోత్సవం
కార్మికుల డిమాండ్ లు నెరవేర్చాలి-లంకదాసరి అశోక్
పరకాల,నేటిధాత్రి
పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో ఏఐటీయూసీ 106వ వ్యవస్థాపక దినోత్సవం కార్మికులు ఘనంగా నిర్వహించారు.అనంతరం హనుమకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లంకదాసరి అశోక్ జెండావివిష్కరణ చేసి ఏఐటీయూసీ 1920లో ఏర్పడి పోరాటాల ఉద్యమాల చరిత్రలో 106వ అవతరణ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా కార్మిక వర్గానికి ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల డిమాండ్ లను ప్రభుత్వం నెరవేర్చాలని అన్ని విధాలుగా కార్మికులను ఆదుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కోగిల.శంకర్,కోట యాదగిరి,రేణిగుంట రాజయ్య,బొట్ల భద్రయ్య,మోరె రవి,శ్రీపతి కలనాయక్,సప్పిడి సాంబయ్య,తిక్క స్వామి,ఈర్ల ఐలయ్య,మామిడి జగన్ తదితరులు పాల్గొన్నారు.
