గుమ్మడి శ్రీదేవిని సన్మానించిన ఏఐసీసీ మహిళా ప్రెసిడెంట్.

AICC

గుమ్మడి శ్రీదేవిని సన్మానించిన ఏఐసీసీ మహిళా ప్రెసిడెంట్.

చిట్యాల నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు భూపాలపల్లి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అయినా గుమ్మడి శ్రీదేవి ని మంగళవారం రోజున హైదరాబాదులోని గాంధీభవన్లో శాలువాతో సన్మానించిన ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబా, ఏఐఎంసి తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఇంచార్జి కమలాక్షి
హైదరాబాద్ గాంధీభవన్ లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు ఆధ్వర్యంలో నిర్వహించిన నారి న్యాయ సమ్మేళన్ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబా హాజరై మాట్లాడుతూ దేశంలోనే లక్షకుపైగా సభ్యత్వలు నమోదు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మహిళా కాంగ్రెస్ అని పేర్కొన్నారు.. తదనంతరం భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా సభ్యత్వలు నమోదు చేసిన సందర్భంగా *మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అయిన గుమ్మడి శ్రీదేవి ని శాలువాతో సన్మానించినారు, పార్టీ కోసం కష్టపడిన వారికి భవిష్యత్తులో చట్టసభలకు అవకాశం కల్పించేలా తన వంతు సహకారం ఉంటుందని ఆమె అన్నారు
కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షురాలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!