ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-27T143317.126.wav?_=1

 

ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

అధిక సంఖ్యలో పాల్గొన్న పద్మశాలి కులస్తులు

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో కూడలి వద్ద ఆచార్య కొండా లక్ష్మణ బాపూజీ 110 జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుక లను పద్మశాలి కులస్తులతో పాటు, బీసీ కులస్తులు పాల్గొని నివాళులర్పించారు. అనంత రం గ్రామ పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి దిడ్డి రమేష్ పాల్గొని మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ బేసి కులాల హక్కుల సాధనకోసం పోరా డిన మహనీయుడని, తెలంగా ణ రాష్ట్ర సాధన కోసం తన పదవిని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను గుర్తించి ఆయన జీవిత చరిత్రను ప్రభుత్వ పాఠ్యపుస్తకాలలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. భారతరత్న బిరుదును కూడా ఇప్పించే విధంగా రాష్ట్ర ప్రభు త్వం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి మండల శాఖ అధ్యక్షులు వంగరి సాంబయ్య, పరకాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారేపల్లి రవీందర్, పద్మశాలి జిల్లా కార్యదర్శి వడ్డేపల్లి శ్రీనివాస్, సోషల్ మీడియా కన్వీనర్ బాసని బాలకృష్ణ, గ్రామ శాఖ అధ్యక్షులు బాసని ప్రకాష్, నాయకులు రంగు మహేందర్, చిందం రవి,బాసని మార్కండేయ, శాంతా రవి, వలపదాసు చంద్రమౌళి,మామి డి మారుతి, బాసని సాయి కృష్ణ, తుమ్మ ప్రభాకర్, బాసని చంద్రమౌళి, శ్రీనివాస్, పరిమ ళ్ళ నోములేష్, చిందం సాయి బాసని అఖిల్, చల్లా శ్రీనివాస్, బత్తుల శ్రీధర్,బీసీ నాయకులు వినుకొండశంకరాచారి, తదిత రులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version