మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
స్థానిక డాక్టర్ బి.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న, డా. ఏ. పి.జె. అబ్దుల్ కలాం జయంతిని కళాశాల ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్. డా. సుకన్య మాట్లాడుతూ భారతదేశ రక్షణ వ్యవస్థను బలపరచడం కోసం ఎంతో కృషిచేసి మిస్సైల్ మాన్ ఆఫ్ ఇండియా పేరుగాంచారని, రాష్ట్రపతిగా ఉంటూ అతి సాధారణ జీవితాన్ని గడిపి ప్రజారాష్ట్రపతిగా ఖ్యాతిగడించారని, అబ్దుల్ కలాం జీవితం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్లు డా. సదాశివయ్య, నందకోషోర్, మాధురి, ప్రవీణ్ మరియు కళాశాల బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.