స్మార్ట్ కిడ్స్ పాఠశాలపైన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేసిన ఐక్య విద్యార్ది సంగం నాయకులు

మంచిర్యాల నేటిదాత్రి

ఈ రోజు మంచిర్యాల పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద గల నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న స్మార్ట్ కిడ్స్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ,కమర్షియల్ బిల్డింగ్ లో విద్య బోధన ,ఆటస్థలం లేదు,సెట్బ్యాక్ లేదు,ఫైర్ సేఫ్టీ లేకుండా వారికి ఇష్టం వచ్చినట్లు గా పాఠశాల ను నడిపిస్తున్నారు అని అన్నారు.ఇలాంటి పాఠశాల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారిని కోరడం జరిగింది. లేనియెడల ఐక్య విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో చిప్పకుర్తి శ్రీనివాస్ తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర కార్యదర్శి, జుమ్మిడి గోపాల్ నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎస్కే సల్మాన్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ,పురెల్ల నితీష్ కుమార్ నేషనల్ లిస్టు స్టూడెంట్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మరియు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!