సిపిఐ జిల్లా కార్యదర్శి కి ఘన సన్మానం.

Secretary Mittapalli Srinivas Secretary Mittapalli Srinivas

సిపిఐ జిల్లా కార్యదర్శి కి ఘన సన్మానం

రామకృష్ణాపూర్,నేటిధాత్రి:

 

 

 

 

సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శిగా రామడుగు లక్ష్మణ్ రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికయిన నేపద్యంలో రామకృష్ణాపూర్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సీపీఐ శ్రేణులు ఘనంగా సన్మానించారు.పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ ను సైతం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామడుగు లక్ష్మణ్ మాట్లాడారు. జిల్లా మహాసభలో చేసిన తీర్మానాలను,పార్టీ ప్రజా సంఘాల నిర్మాణానికి స్థానిక సమస్యల పరిష్కారానికి భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై కౌన్సిల్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇప్పకాయల లింగయ్య, మిట్టపల్లి పౌల్, వెంకటస్వామి, వనం సత్యనారాయణ, సాంబయ్య, గోపి, మణెమ్మ,శంకర్,రాములు, సత్తన్న, మొగిలి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!