ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ నందు మండలానికి చెందిన 13620 మంది రైతులకు 11 కోట్ల 83 లక్షల రూపాయలు రైతుల ఖాతాలో రైతు భరోసా జమ చేసిన సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి,
ఈ సందర్భంగా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ తో పాటు రైతులు పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధర అలాగే సన్న రకం ధాన్యానికి 500 బోనస్, రైతు భరోసా అందించి రైతులకు ఎంతో మేలు చేసిందన్నారు.
ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డికి, ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ కు, ఎంపీ పొరిక బలరాం నాయక్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి,ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి,మాజీ ఎంపీపీ కదిరే సురేందర్,మాజీ ఎంపీపీ భూక్యా మల్సూర్,మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ ఓలం రమేష్,వసంత రావు, ఎండీ ఆయుబ్ ఖాన్, చింతకుంట్ల యాదగిరి,బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి పోలేపాక నాగరాజు,మాజీ సర్పంచ్ వెంకన్న,మాజీ ఉపసర్పంచ్ బానోత్ వెంకన్న,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అల్లం గణేష్ యాదవ్,మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కళ్ళెం శ్రీనివాస్ రెడ్డి,గ్రామ పార్టీ అధ్యక్షులు కొండ సురేష్,నూకల వెంకటేశ్వర్లు, నేరేటి కొమరయ్య,గండి శ్రీనివాస్, సమ సుధాకర్, పోలేపల్లి వెంకట్ రెడ్డి,బలు,ఎండీ తాజోద్దీన్,రషీద్ ఖాన్, ఎండీ నవాజ్,తరాల సుధాకర్,బోడ విక్కి,శేఖర్ రెడ్డి, ఎలందర్,బాల,హనుమ,బాధ్య,శ్రీనివాస్,యాకాంతచారి,పరకాల కుమార్,ముజ్జు షేక్,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధానకార్యదర్శి తోట అఖిల్,సామల నరసయ్య,అజిత్ రెడ్డి, నియోజవర్గ ఉపాధ్యక్షుడు హరి కృష్ణ,మండల ఉపాధ్యక్షుడు ఎండీ సమీర్,సుందర్ వెంకన్న,మామిడిచెట్టు మల్లయ్య,తోట సుధాకర్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.