మహారుద్ర యాగంలో పాల్గొన్న తాజా మాజీ సర్పంచ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం లోని బర్దీపూర్ ఆశ్రమంలో గత నలభై రోజులుగా . డా.సిద్ధేశ్వర అవదూత గిరి మహరాజ్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహారుద్ర యాగంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది అని ఈ సందర్భంగా మేధపల్లి తాజ్ మాజీ సర్పంచ్ పరమేశ్వర పాటిల్.మాట్లాడుతూ దేశాన్ని పట్టి పీడిస్తున్న రాక్షసా శక్తుల పీడ నివారణకై.చేపడుతున్న ఇట్టి యజ్ఞంలో పాల్గొనడం తో చాలా సంతోషంగా ఉందని అన్నారు.ఇలాంటి యజ్ఞాలు మరిన్ని చేయాలని దేశ సైనికులకు ప్రజలకు శాంతీ సౌభాగ్యం కలిగించాలని శత్రు పీడ నశించాలి అని లోక కళ్యాణఅర్థం ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు.