భూ సమస్యల సత్వర పరిష్కారం కొరకై భూభారతి సదస్సులు.

MLA MLA

భూ సమస్యల సత్వర పరిష్కారం కొరకై భూభారతి సదస్సులు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

 

మొగుళ్ళపల్లి, నేటి ధాత్రి:

 

 

 

భూ సమస్యల సత్వర పరిష్కారం కోసమే గ్రామాలలో భూభారతి రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహసిల్దార్ సునీత పేర్కొన్నారు. బుధవారం మండలంలోని అంకుషాపురం రంగాపురం గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయగా రైతుల నుండి పలు సమస్యలపై దరఖాస్తులను తహసిల్దార్ నేరుగా స్వీకరించడమైనది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆర్డీవో పాల్గొని రైతులకు సూచనలు ఇచ్చి అవకాశం వినియోగించుకోవాలని సూచించారు రైతుల నుండి వచ్చిన ప్రతి దరఖాస్తును రిజిస్టర్ లో నమోదు చేసుకొని దరఖాస్తుల ఆధారంగా రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ జరిపి భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు. 5/06/2025 రోజున ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు గుడిపాడు వేములపల్లి గ్రామాలలో రెవెన్యూ సదస్సు నిర్వహించబడుతుందని ఆ గ్రామాలలో ఉన్న రైతుల భూమికి సంబంధించి ఎటువంటి సమస్య ఉన్న వారి దగ్గర ఉన్న ఆధారాలతో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ రైతులుఅవకాశాన్ని వినియోగించుకోవాలని తాసిల్దారు కోరారు కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!