క్రీడాకారులకు టీ షర్ట్లు బహుకరణ
నేటిధాత్రి అయినవోలు:-
అయినవోలు మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది. టోర్నమెంట్లో పాల్గొంటున్న క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా అయినవోలు మండల కాంగ్రెస్ ఎస్టీ సెల్ మండల నాయకులు పల్లకొండ కుమార్ క్రీడాకారులకు గురువారం టీ షర్టులను బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువత క్రీడల్లో నైపుణ్యం సాధించి మానసికంగా శారీరకంగా దృఢత్వాన్ని సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల యువ నాయకులు బొల్లె పెల్లి బిక్షపతి గౌడ్ పల్లకొండ రమేష్ టోర్నమెంట్ నిర్వాహకులు క్రీడాకారులు పాల్గొన్నారు.