‘‘బీఆర్ఎస్’’ రజతోత్సవాలు అంటే పార్టీ పండుగ మాత్రమే కాదు… ప్రజల పండుగ…అంటున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ‘‘బి. వినోద్ కుమార్’’, నేటిధాత్రి ఎడిటర్ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’తో పంచుకున్న ఉద్యమ స్మృతులు, పార్టీ ప్రస్థానంపై పంచుకున్న విషయాలు, విశేషాలు ఆయన మాటల్లోనే..
`మరో వందేళ్ల బీఆర్ఎస్ కు పడనున్న అడుగులు
`తెలంగాణ వున్నంత వరుకు బిఆర్ఎస్ వుంటుంది
`బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పుడూ వుంటుంది
`తెలంగాణ తెచ్చిన పార్టీగా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది
`తెలంగాణ తలరాత మార్చిన పార్టీగా మనుగడలోనే వుంటుంది
`బీఆర్ఎస్ రాజకీయ ఉద్యమ పోరాటం నిండిన పార్టీ
`వ్యక్తిగత రాజకీయాల కోసం పుట్టిన పార్టీ కాదు
`సిద్ధాంతాలు లేని పార్టీలు బీఆర్ఎస్కు ఎప్పుడూ పోటీ కాదు
`ప్రపంచ చరిత్రలోనే ఈతరం ప్రజల కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్
`తెలంగాణ సంకెళ్లు తెగించి కొట్లాడి తెంపిన పార్టీ
`తెలంగాణకు స్వేచ్ఛా వాయువులు ప్రసాదించిన పార్టీ
`తెలంగాణ ఆత్మ గౌరవం నింపిన పార్టీ
`తెలంగాణ చైతన్య రథాలు కదిలించిన పార్టీ బీఆర్ఎస్
`తెలంగాణలో చైతన్య కిరణాలు నింపిన పార్టీ బీఆర్ఎస్
`తెలంగాణ నే ఒక ఉద్యమ ప్రవాహంగా మార్చిన పార్టీ బీఆర్ఎస్
`తెలంగాణ పోరులావా పొంగించిన పార్టీ బీఆర్ఎస్
`బీఆర్ఎస్ లేకుంటే జై తెలంగాణ నినాదమే లేదు
`కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు
`కేసీఆర్ అనే పదమే విశ్వజనీనం
`బీఆర్ఎస్ అనే పార్టీయే ఉద్యమ సోపానం
హైదరాబాద్,నేటిధాత్రి:
బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలంటే ఒక్క పార్టీ పండుగనే కాదు. అది తెలంగాణ ప్రజల పండుగ. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ పండుగ. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు బిఆర్ఎస్. కేసిఆర్ మది నుంచి జాలు వారిన ఆశయాలు, ఆలోచనలు నుంచి పురుడు పోసుకున్న పార్టీ బిఆర్ఎస్. బిఆర్ఎస్ ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తవుతున్న శుభవేళ జరుపుకుంటున్న ప్రజా సంబురాలు. పార్టీ వేడుకనే కాదు, ప్రేజా వేడుకలు. తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించిన పార్టీ. ప్రజా ప్రవాహాన్ని పోరుబాటగా మలిచిన పార్టీ. ప్రజా సేవలో, ఉద్యమ స్వరూపాన్ని నింపిన పార్టీ. తెలంగాణ అభివృద్ది ప్రాంత హక్కు..తెలంగాణ రాష్ట్ర జన్మ హక్కు అని నినాదం నుంచి పుట్టిన పార్టీ. తెలంగాణ ఆత్మగౌరవం నింపుకొని, తెలంగాణ ఆత్మాభిమానం చాటి చెప్పిన పార్టీ. ఒక వ్యక్తి రాజకీయం కోసం పుట్టిన పార్టీ కాదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ. తెలంగాణ ఆత్మగౌరవం నుంచి పుట్టినపార్టీ. తెలంగాణకోసం కేసిఆర్ చేసిన త్యాగం నుంచి ఉద్భవించినపార్టీ. 60 సంవత్సరాల తెలంగాణ గోసను నుంచి విముక్తికోసం పుట్టిన పార్టీ. పద్నాలుగేళ్లపాటు అలుపెరగని పోరాటం చేసి, తెలంగాణ సాదించిన పార్టీ. తెలంగాణ తెచ్చిన కేసిఆర్ చేతుల మీదుగా బంగారు తెలంగాణ ఆవిష్కారం చేసిన పార్టీ. మోడువారిని పల్లెను చిగురించిన పార్టీ. చుక్క నీటి కోసం తల్లడిల్లిన పల్లెలో గోదారి పరవళ్లు తొక్కించిన పార్టీ. ఇంటింటికీ గోదారి నీళ్లందించిన పార్టీ. సాగు లేక, సాగు చేయలేక రైతు కన్నీటి వ్యవసాయం నుంచి, గోదారి గలగలలు వింటూ రైతు కన్నీళ్లు తుడిచిన పార్టీ. ఒకప్పుడు తొండలు కూడా గుడ్లు పెట్టవంటూ వెటకారం చేసిన వాళ్లు కోట్ల రూపాయల ధరలు పలికేలా తెలంగాణను తీర్చిదిద్దిన పార్టీ. అందుకే బిఆర్ఎస్ అంటే తెలంగాణ ఇంటి పార్టీ. తెలంగాణ కుటుంబ పార్టీ. తెలంగాణ గుండెల్లో చిరస్ధాయిగా నిలిచిపోయే పార్టీ. మరో వెయ్యేల్లయినా చెరిగిపోని, తరిగిపోని చరిత్ర బిఆర్ఎస్ పార్టీది. తెలంగాణ ఉనికి వున్నంత వరకు నిలిచిపోయే పార్టీ. తెలంగాణ అస్ధిత్వాన్ని తన భుజాల మీద మోసే ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ. ఎన్ని తరాలు మారినా తరగని చిరునామా లాగా శాశ్వతంగా తెలంగాణ గుండెల్లో నిండిన పార్టీ అంటున్న బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు బోయిన పల్లి వినోద్ కుమార్, నేటిధాత్రి ఎటిటర్ కట్టా రాఘవేంద్రరావుతో ఉద్యమ కాలం నాటి అనుభవాలు, బిఆర్ఎస్ పుట్టు పూర్వత్తరాలపై పంచుకున్న ఆసక్తికరమైన అంశాలు…ఆయన మాటల్లోనే..
బిఆర్ఎస్ పార్టీ రజతోత్స సంబురాలు అంటే పార్టీ పండుగ మాత్రమే కాదు…అవి ప్రజల జరుపుకునే పండుగ. తెలంగాణ కోసమే పుట్టి, అలుపెరుగని పోరాటం చేసి, తెలంగాణ తెచ్చిన పార్టీ. ఈ సంబురాల వేళ మరో వెయ్యేళ్ల ప్రయాణం సాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే బిఆర్ఎస్ అనేది తెలంగాణ ప్రజల పార్టీ. మా పార్టీ బిఆర్ఎస్ అని ప్రజలు గర్వంగా చెప్పుకునేపార్టీ. త్యాగాల నుంచి పుట్టి, తెలంగాణ పొలికేకలు పెట్టి, గులాబీ జెండాను పట్టి, పిడికిలెత్తి జై తెలంగాణ అని నినదించిన ఏకైక పార్టీ. అసలు తెలంగాణ అనడానికి తెలంగాణ నాయకులకే నోరు రాని రోజులవి. తెలంగాణ అంటే ఎక్కడ తమ పదవులు పోతాయో అని భయపడిపోయిన రోజులు. వెనుకబడిన ప్రాంతం అని తెలంగాణ నాయకుల చేత సమైక్య పాలకులు చెప్పించిన కాలం. కష్టమొచ్చిన చెప్పొదు. కాలం కాకపోయినా ఏడువొద్దు. తెలంగాణ కోసం ఏది అడిగినా గొంతెమ్మ కోరికలంటూ సమ్యై వాదులు హేళన చేసిన రోజుల నుంచి జై తెలంగాణ అని దిక్కులు పిక్కటిల్లేలా గర్జించిన కేసిఆర్ ఉక్కు సంకల్పం నుంచి ఉద్భవించిన గులాబి సింహస్వప్నం బిఆర్ఎస్ పార్టీ. ఆ మాటలు చెబుతుంటేనే రక్తం మరుగుతుంది. బిఆర్ఎస్ అని పలుకుతుంటేనే రక్తం ఉప్పెనై పొంగుతుంది. అంతటి శక్తి వంతమైన పదం బిఆర్ఎస్. గులాబీ జెండను చూస్తేనే ఉద్యమం ఉరకలెత్తేది. ప్రజలు జెండా పట్టుకొని ఉద్యమ రంగంలోకి దింకేలా చేసింది. అంత గొప్పది. అందుకే టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ వున్నంత వరకు వుంటుంది. తెలంగాణ గుండెల్లో ఎప్పుడూ చిరంజీవిగా చిరస్ధాయిగా నిలిచిపోతుంది. తెలంగాణ గుండెలో గులాబీ రెపరెపలాడుతూ వుంటుంది. తెలంగాణ తలరాత మార్చిన పార్టీగా రాజకీయ మనుగడలో ముందు వరుసలోనే వుంటుంది. బిఆర్ఎస్ అని పలుకుతున్న ప్రతి సందర్భంలోనూ కేసిర్, కేసిఆర్ అని ప్రకృతి నుంచిధ్వని వినిపిస్తుంది. తెలంగాణ మూల సిద్దాంతంగా, తెలంగాణ వాదమే సూత్రంగా పుట్టిన పార్టీ. సిద్దాంతాలు లేని ఏ రాజకీయ పార్టీ బిఆర్ఎస్కు పోటీ కాదు. రాలేదు. తెలంగాణ సంకెళ్లను తెంచడానికి తెగించి కొట్లాడిన పార్టీ బిఆర్ఎస్. తెలంగాణలో అణువణువూ నిండిన పార్టీ. తెలంగాణ వాదానికే కాదు, తెలంగాణకే స్వేచ్చా వాయువులు ప్రసరింపజేసి పార్టీ. ఉద్యమానికి ఊపిరి పోసి, తెలంగాణ చైతన్య రథ చక్రాలు కదిలించిన పార్టీ. తెలంగాణలో చైతన్య కిరణాలు పంచిన పార్టీ. తెలంగాణనే ఒక ఉద్యమ ప్రవాహంగా మార్చిన పార్టీ. తెలంగాణ పోరు లావా పొంగించిన పార్టీ. ఎందుకంటే బిఆర్ఎస్ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు. అందుకే కేసిఆర్ అనే మూడక్షరాల పదం విశ్వజననీం…సర్వాంతర్యామి స్వరూపం. బిఆర్ఎస్ పార్టీయే ఉద్యమ సోపానం. తెలంగాణ కోసం కేసిఆర్ తొలి అడుగు వేసిన నాడు ఎటు చూసినా ఎడారి పరిస్ధితులు. ఒక్కడుగా అడుగులు మొదలు పెట్టాడు. ఒక్కడే సింహమై గర్జించాడు. ఒక్కడే జై తెలంగాణ అని పిడికిలెత్తి నినదించాడు. ఒక్కడే అసెంబ్లీలో తన గళం వినిపించాడు. ఒక్కడే అసెంబ్లీలో తెలంగాణ సమస్యలపై ఏకరువు పెట్టారు. కేసిఆర్ నోరు నొక్కేందుకు ఎంతో ప్రయత్నం చేశారు. తెలంగాణ కోసం తొలి రాజీనామా చేసినప్పుడు, తెలంగాణ వాదాన్ని సమూలంగా అణచివేయాలని చూశారు. ఎక్కడికక్కడ అప్పటి ఉమ్మడి పాలకపక్షంతో పాటు, అప్పటి ప్రతిపక్షం కూడా చేతులు కలిపి, కేసిఆర్ను ఓడిరచాలని విశ్వ ప్రయత్నం చేశారు. ఎందుకంటే కేసిఆర్ నాయకత్వం ఎలాంటిదో అప్పటికే ఉమ్మడి పాలకులకు తెలుసు. కేసిఆర్ ఎంతటి పట్టుదల వున్న నాయకుడో తెలుసు. కేసిఆర్ ఎంతటి విజ్ఞానవంతుడో తెలుసు. ఎంతటి వాగ్ధాటి కల్గిన నాయకుడో తెలుసు. తెలంగాణపై కేసిఆర్కు వున్నంత అవగాహన మరే నాయకుడికి లేదని తెలుసు. అందుకే అడుగడుగునా కేసిఆర్ను అవమానపర్చాలని చూశారు. కేసిఆర్ అదే తీరులో స్పందించి సింహస్పప్నమైన వారి విమర్శలకు తెలంగాణ నిజాలు చెప్పి నోరు మూపించేవారు. అలా ప్రజలందరికీ తెలంగాణ కావాలని వున్నా,కేవలం పదవుల కోసం ఉమ్మడి పాలకులకు మోచేతి నీళ్లు తాగే నాయకులు కేసిఆర్ను పలుచన చేయాలని అనేక మార్లు ప్రయత్నం చేశారు. కాని ధర్మం, న్యాయం కేసిఆర్ వైపు నిలించింది. కేసిఆర్ మీద నమ్మకంతో తెలంగాణ అంతా కదిలింది. తొలి గులాబీ జెండా ఎగిరింది. అది తెలంగాణ అంతటా రెపరెపలాడిరది. దేశ దిగంతాలు దాటి ప్రపంచంలో తెలంగాణ వాదులున్న అన్ని దేశాలలో గులాబీ జెండా ఎగిరింది. నిజానికి రాజకీయ పార్టీ నపడం అంటే సామాన్యమైన విషయం కాదు. పైగా ఉద్యమ పార్టీ నిర్వహణ అనేది మరింత అసాద్యం. అటు ఉద్యమాన్ని రంగరించి, ఇటు రాజకీయానికి చాణక్యాన్ని జోడిరచి కేసిఆర్ సాగించిన ప్రయాణం ప్రపంచంలోనే ఎక్కడా, ఎవ్వరూ నిర్వహించి వుండరు. తెలంగాణ కోసం కేసిఆర్ చేసిన సాహసం అంతా ఇంతా కాదు. కేవలం ఆమరణ దీక్ష సమయంలోనే ,కాదు అడుగుడుగునా ఆయన తన ప్రాణాలను లెక్క చేయకుండా ఉద్యమాన్ని కొనసాగించారు. పార్టీని నడిపించారు. ప్రజలను చైతన్యం నింపారు. పసిపాప నుంచి మొదలు పండు ముసలివరకు జై తెలంగాణ అని నినదించేలా కోట్లాది మంది తెలంగాణ వాదులను తయారు చేశారు. ఒక్క కేసిఆర్ గొంతు కోట్ల గొంతుకలై జై తెలంగాణ అని గర్జిస్తుంటే దిక్కులు మారుమ్రోగిపోయాయి. అదీ కేసిఆర్ అంటే..అలాంటి కేసిఆర్ పెట్టిన బిఆర్ఎస్ పార్టీ ఆచంద్ర తారార్కం వెలుగుతుందని చెప్పడంలో సందేహంలేదు. తెలంగాణ వున్నంత వరకు, తెలంగాణ ఉనికి వున్నంత వరకే కాదు, ఎన్ని వేల సంవత్సరాలైనా సరే ఆయన నడిచిన అడుగులు చరిత్ర పుటల్లో సజీవంగా వుంటాయి. అందుకే బిఆర్ఎస్ రజతోత్సవాలను ప్రజలే జరుపుకునేందుకు వరంగల్ వస్తారు. ప్రజలే ఆ పండుగను ఆశీర్వదిస్తారు. మహా సింహగర్జనను మించిన సభను నిర్వహించి, తెలంగాణ వాదం ఎంత బలమైందో, కేసిఆర్ నాయకత్వం ఎంత గొప్పదో చూస్తారు. కేసిఆర్ పిలుపు ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుందో వరంగల్ రజతోత్సవ సభతో మరోసారి తెలుసుకుంటారు. కేసిఆర్తోపాటు తొలి నుంచి ఇప్పటి దాకా తెలంగాణ కోసం పునరంకితమైనందుకు నా జన్మ కూడా ధన్యమైందనే అనుకుంటాను. తెలంగాణ ఉద్యమంలో నేను కీలకమైన పాత్ర పోషించాను. కరుడుగట్టిన బిఆర్ఎస్ సైనికుడిగా పార్టీకోసం పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాను.