ఆ ఫీల్డ్ అసిస్టెంట్ మాకొద్దు..
జహీరాబాద్ నేటి ధాత్రి:
నెల రోజుల నుంచి కూలీ పనులు కల్పించడం లేదు పని చేసిన తర్వాత కొలతలు మేమే తీసుకోవాలి ప్రశ్నిస్తే మీ ఇష్టమున్న చోట చెప్పుకొండి అంటూ దబాయింపు ఎంపిడిఓ ముందు మొర పెట్టుకున్న కూలీలు
ఉపాధి హామీ పథకంలో తమకు సరిగా కూలీ పని కల్పించడం లేదని, పనిచేసిన తరువాత కొలతలు కూడా తమే చేసుకోవాల్సి ఉందని మం డల పరిధిలోని తుమ్మన్ పల్లి గ్రామానికి చెందిన సుమారు 30 మంది ఉపాధి కూలీలు శుక్రవారం ఎంపిడిఓ సుధాకర్ కు మొర పెట్టుకు న్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ పనితీరుకు వ్యతిరేకంగా కూలీలు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. తమ కు నెలరోజుల నుంచి సరిగా కూలీకల్పించడం లేదన్నారు. కప్పాడ్ గ్రామా నికి చెందిన వ్యక్తిని తమ గ్రామానికి ఫీల్డ్ అసిస్టెంట్గా నియమించా దంతో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాడన్నారు. పని విషయంలో ఏదైనా అడుగుతే సరైన సమాధానం ఇవ్వడం లేదు. ఇష్టం ఉంటే చే యండే లేదంటే పని మానుకుండి తమకు దబాయిస్తున్నాడని వారు. వాపోయారు. ఈ విషయంపై ఫీల్డ్ అసిస్టెంట్ కు ఎంపిడినో ఫోన్ చేసి ఆయన పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీలకు పని కల్పించ కపోతే విధుల నుంచి తొలగించడం జరుగుతుందని ఆయన హెచ్చరిం చారు. విధులకు సక్రమంగా హాజరు కానిఉపాధి హామీ ఈసి ప్రతాప్ రెడ్డిపై కూడా శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.