నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం భవనం నిర్మించాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,నేర్మట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం భవనం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనిఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం భవనం లేక పోవడం వల్లన గ్రామపంచాయతీ భవనంలోనే నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. ఈ గ్రామానికి నాలుగు గ్రామాల ప్రజలైన ధోని పాముల, జోగి గూడెం, తిమ్మారెడ్డి గూడెం, తుమ్మల పల్లి గ్రామాల ప్రజలునేర్మట గ్రామానికి వస్తారని, ఈ గ్రామంలోని సబ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించి ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలోసిపిఎం నాయకులుఈరటి వెంకన్న, బల్లెం స్వామి, నరసింహతదితరులు పాల్గొన్నారు.
ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం భవనం నిర్మించాలి:సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ
