నడికూడ,నేటిధాత్రి:
ప్రపంచ చేనేత దినోత్సవం సందర్భంగా పద్మశాలి సేవా సంఘం నడికూడ మండల అధ్యక్షుడు గాదె శంకరయ్య ఆధ్వర్యంలో మండలంలోని రాయపర్తి,చర్లపల్లి,వెంకటేశ్వర్ల పల్లె గ్రామాలలో బుధవారం ప్రపంచ చేనేత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.అనంతరం కార్మికులను శాలువతో కప్పి సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పాశికంటి రమేష్, మండల యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ఆకునూరి రమేష్,మండల నాయకులు కళ్యాణపు మూర్తిలింగం, మోతుకూరి శంకరయ్య, వంగర రమేష్,రాచర్ల శ్రీనివాస్,మరియు చేనేత సహకార సంఘం డైరెక్టర్లు, చైర్మన్ లు, తదితరులు పాల్గొన్నారు.