అద్దె చెల్లించలేదని తహసిల్దార్ కార్యాలయానికి తాళం,

నిజాంపేట: నేటి ధాత్రి

అద్దె చెల్లించడం లేదని తహసీల్దార్‌ కార్యాలయంకు తాళం వేసిన సంఘటన బుదవారం నాడు స్థానిక మండల తహసీల్దార్‌ కార్యాలయంకు తాళం వేశారు. ఈమేరకు నూతనంగా నిర్మించుకున్న నిజాంపేట మండల కేంద్రంలో కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి సరిౖయెన భవనాలు లేకపోవడంతో గ్రామంలోని ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. దీంతో కార్యాలయంకు 2022 డిసెంబర్‌ వరకు అద్దెకు చెల్లించిన్నట్టు ఇంటి యాజమాని పేర్కోన్నారు. గత 18 నెలలుగా ఇంటి బిల్లు చెల్లించడం లేదని కార్యాలయం చుట్టు తిరుగుతున్న అద్దె చెల్లించడం లేదన్నారు. ఈ విషయమై ఆర్డీవోకు, జిల్లా కలెక్టర్‌కు వినతి అందజేసిన అదికారులు పట్టించుకోవడంలేదన్నారు. దీంతో ఇంటి యాజమాని అద్దె చెల్లించకపోవడంతో కార్యాలయంకు తాళం వేసిన్నట్లు తెలిపారు. కార్యాలయంకు తాళం వేయడంతో సిబ్బంది అక్కడే నిలబడే పరిస్థితి నెలకొంది. కార్యాలయంకు వచ్చే వారికి ఎంతో ఇబ్బందిని ఎదుర్కోన్నారు. వెంటనే అదికారులు స్పందించి కార్యాలయం బిల్లులు చెల్లించాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!