కుంచెతో కలల ప్రపంచాన్ని సృష్టించేవాడే కళాకారుడు

నెక్కొండ, నేటిధాత్రి :

నేటి ఆధునిక ప్రపంచం లొ కుంచెతో వ్యక్తుల ప్రతిబింబాలను చిత్రీకరించి రంగుల ప్రపంచాన్ని సృష్టించి అందులో విహరించేవాడే కళాకారుడని వరల్డ్ ఆర్ట్స్ డే సందర్భంగా నెక్కొండలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్టిస్ట్ కాలువచర్ల రఘు, ఈదునూరి సాయి కృష్ణ, లు అన్నారు. కుంచెతో మెము వేసే చిత్రాలు, అన్ని మతాలవారు పూజించే దేవుళ్ళ విగ్రహాలను ఆ విగ్రహాల నుండీ తేజస్సు ఉట్టిపడే లా తీర్చిదిద్దే కుంచె మాదని ,మా కుంచె మేము అన్ని మతాల దేవుళ్లను మా ఉంచే తో మేము స్పర్శిస్తామని ఇది ఒక వరముగా మేము భావిస్తున్నామని వారన్నారు.వ్యాపారాల ప్రకటనలు, రాజకీయ పార్టీల గుర్తుల ప్రకటనలతో వారి జీవితాలు ఒక మెలుగు వెలుగుతాయి కానీ కళాకారుల మైన మమ్మల్ని ఏ ప్రభుత్వాలు, ఏ ప్రజా ప్రతినిధి ,ఏ అధికారి , పట్టించుకోకుండా ఎలాంటి ప్రోత్సాహం చేయూత,ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయి, కానీ కుంచె ను నమ్ముకున్న మాకు ఆ కుంచే జీవనాధారం అవుతున్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *