ముత్తారం :- నేటి ధాత్రి
పెద్దపల్లి జిల్లాపరిషత్ చైర్మన్ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో అడవి శ్రీరాంపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు
ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన సల్పాల. రాజు యాదవ సంఘం డైరక్టర్, కురిమిండ్ల. మహేష్ కాంగ్రెస్ పార్టీనీ వీడి బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు వారికీ పుట్ట మధుకర్ పార్టీ కండువా వేసి పార్టీ లోకి ఆహ్వానించారు అనంతరం వారు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ది పనులకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని మంథని లో పుట్ట మధు వల్లనే మంథని నియోజకవర్గం అభివృద్ధి చెందింది అని ఇలాంటి అభివృద్ది కార్యక్రమాలు 60 సంవత్సరాల పాలనలో ఏ నాయకుడు చేయలేదని. మంథని లో పుట్ట మధు భారీ మెజారిటీతో గెలవడం కాయమని వారు మాట్లాడారు ఈ కార్యక్రమం లో సర్పంచ్ తుంగని సమ్మయ్య బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు