Lok Adalat Awareness Program in Ankushapur
అంకుషాపుర్ గ్రామంలో లోక్ అదాలత్ అవగాహన కార్యక్రమం
సత్వర న్యాయం కావాలంటే లోక్ అదాలత్ ఒకటే మార్గం
పారా లీగల్ వాలంటర్ అంబాల నరేందర్
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండలం అంకుషాపుర్ గ్రామంలో పారా లీగల్ వాలంటర్ అంబాల నరేందర్ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ పై గ్రామ ప్రజలకు అవగాహన సదస్సును నిర్వహించారు. మండలంలోని అంకుషాపుర్ గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద గ్రామ పెద్దలు గ్రామ ప్రజల తో కలిసి లోక్ అదాలత్ పై గ్రామ ప్రజలు కు అవగాహన కార్యక్రమం నిర్వహించి అందులో భాగంగా అంకుషాపుర్ గ్రామంలో పారా లీగల్ వాలంటర్ అంబాల నరేందర్ మాట్లాడుతూ
మాట్లాడుతూ లోక్ అదాలత్ ను వినియోగించుకోండి సమస్యలను పరిష్కరించుకోవాలని, సత్వర న్యాయం కావాలంటే లోక్ అదాలత్ ఒక్కటే మార్గమని, చిరకాలంగా కోర్టు నందు పరిష్కారం కానీ నిలిచిపోయిన మీ కేసులను లోక్ అదాలత్ ద్వారా తక్కువ వ్యవధిలో ఖర్చు లేకుండా మీ కేసులను పరిష్కరించుకోవచ్చని మార్చి 28 రోజున జిల్లా కోర్టులో లోక్ అదాలత్ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
