గుంతల మయమైన శేఖాపూర్ రోడ్డును పరిశీలించిన నాయకులు
◆-: జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నుండి వయా శేఖాపూర్ కర్ణాటక బార్డర్ బోనస్ పూర్ వరకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక శాసన సభ్యులు కొనింటి మాణిక్ రావు గారు అప్పటి మంత్రి తన్నీరు హరీష్ రావు గారి సహకారంతో నిధులను మంజూరు చేయించారు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పనులను చేయించడం లేదు నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తూ తమ ప్రయాణ గమ్యాన్ని చేరుకుంటు జహీరాబాద్ మండలంలోని హోతి కె గ్రామం మీదుగా ప్రయాణిస్తూ శేకపూర్ గ్రామం మీదుగా మల్చేల్మా, పర్శపల్లి, బడం పెట్, మనియార్ పల్లి, ఆనేగుంట, మల్చేల్మా, కుంచారం, తాండూర్ కు వెళ్లే వాహనదారులు నిత్యం గుంతలమాయమైన రోడ్డుపై ప్రయాణిస్తూ తరచు ప్రమాదాల బారిన పడటమే కాకుండా కొందరి ప్రాణాలను సైతం కోల్పోయారు అతికష్టమైన ప్రయాణాన్ని సాగిస్తూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయనిస్తున్నారు. గురువారం నాడు బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, శేకపూర్ గ్రామ సర్పంచ్ మొహమ్మద్ చెష్మోద్దీన్ ,రేషన్ డీలర్స్ అసోసియేషన్ జహీరాబాద్ డివిజన్ అధ్యక్షులు గడ్డమీది విజేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ చిన్నా రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపై పడ్డ గుంతలను పరిశీలించి పక్షం రోజుల్లో రోడ్డు నిర్మాణం పనులు మొదలు పెట్టకపోతే సమీప గ్రామాల ప్రజలతో కలిసి పెద్దఎత్తున ఆందోళన చేపడతామని, అక్కడ కూడా స్పందన రాకపోతే శేకపూర్, మల్చేల్మా, అనేగుంట, పర్శపల్లి, గోటిగార్ పల్లి బడం పెట్ గ్రామ ప్రజలతో కలిసి శేఖాపూర్ రోడ్డుపై నిరాహార దీక్ష చేపడతామని తట్టు నారాయణ హెచ్చరించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు సైఫోద్దీన్ మొహమ్మద్ జాహిద్, మొహమ్మద్ పాష, సదర్ మైబ్ పాశ ,ఇసాక్ షాబొద్దీన్ ,పాష భాయ్ మాచి రెడ్డి పల్లి ,మాజీ ఎంపీటీసీ నారాయణ్ గౌడ్ ,ఖుర్షిద్ మాజి సర్పంచ్ జగదీష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
