AISF Stages Protest Against Bits School Management
శాంతినికేతన్ హై స్కూల్ ముందు ధర్నా నిర్వహించిన ఏఐఎస్ఎఫ్
బిట్స్ పాఠశాల యాజమాన్యం పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నాయకులు శాంతినికేతన్ హైస్కూల్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోతుకు.ప్రవీణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్ లు మాట్లాడుతూ భూపాలపల్లి బిట్స్ బిట్స్ పాఠశాల యాజమాన్యం శాంతినికేతన్ హైస్కూల్ పేరు మీద అనుమతులు తీసుకొని ఆ పాఠశాల పేరు వాడకుండా బిట్స్ స్కూల్ అని జిల్లా ప్రజలను,విద్యార్థుల తల్లిదండ్రులను నమ్మించి విద్యార్థులను అడ్మిషన్ తీసుకొని మోసం చేశారని అన్నారు.
విద్యార్థుల రిజిస్టర్, టీ సీ రికార్డ్ షీట్, విద్యార్థుల ఐడి కార్డ్, ఫీజు రసీదుల మీద శాంతినికేతన్ హైస్కూల్ అని ఉండాలి. కానీ బిట్స్ పాఠశాల పేరు పేరుమీద అక్రమంగా బిట్స్ పాఠశాలను నడిపించడం జరుగుతుంది అని అన్నారు. ఇంత పెద్ద మోసానికి పాల్పడుతున్న బిట్స్ యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని అధికారులను సూటిగా ప్రశ్నించారు. బిట్స్ యాజమాన్యం పై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని క్రిమినల్ కేసులను నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పది సంవత్సరాల నుండి శాంతినికేతన్ హైస్కూల్ మూసి వేసినప్పటికీ పాఠశాల నడుస్తుందని తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సృష్టించి శాంతినికేతన్ హైస్కూల్ పేరు మీద అనుమతులు తీసుకున్నారని అన్నారు.
జీవో నెంబర్ 1ఒకటి ప్రకారం ఏ ప్రైవేట్ పాఠశాల అయినా ఐదు సంవత్సరాలు పాఠశాల నడిపించకపోతే పూర్తిస్థాయిలో ఆ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని నిబంధన ఉన్నప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారులు శాంతినికేతన్ పాఠశాలకు ఏ విధంగా షిఫ్టింగ్ పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడిన జిల్లా విద్యాశాఖ అధికారుల పైన, శాంతినికేతన్ హైస్కూల్ అయితే కరుణాకర్ రెడ్డి, బిట్స్ యాజమాన్యం రాజేంద్రప్రసాద్ పైన చర్యలు తీసుకునేంతవరకు ఆందోళన పోరాటాలు చేస్తామని ప్రవీణ్ జోసఫ్ లు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు ఒంటేరు రాజేష్, జంపాల పవన్,అజయ్, సాయి కృష్ణ, రజనీకాంత్, సాదన్, అంజాద్, ఉమేష్, రామ్ చరణ్,నజీర్,శ్రీరామ్
.తదితరులు పాల్గొన్నారు.
