జైపూర్,నేటి ధాత్రి:
బుధవారం రోజున చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఎం.సీ. పార్గెయిన్ ఐఎఫ్ఎస్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఎఫ్డిపిటి ఎస్. శాంతారాం ఐఎఫ్ఎస్ ఆదేశాల మేరకు మంచిర్యాల డిఎఫ్ఓ శివ్అశీష్ సింగ్ ఐఎఫ్ఎస్సి మరియు ఎఫ్ డిఓ వినయ్ కుమార్ సాహు ఎసిఎఫ్ ఆద్వర్యం లో మంచిర్యాల్ రేంజ్ పరిది లో గల మంచిర్యాల్ చెన్నూర్ కారిడార్ అటవీ ప్రాంతంలో 19 చుక్కలదుప్పులను వదిలి వేయడం జరిగింది. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మంచిర్యాల్ మరియు చెన్నూర్ కారిడార్ అభివృద్ధి లో భాగంగా ఇట్టిపనిని చేయడం జరిగిందనీ అటవీశాఖ అధికారులు తెలియజేశారు. రోజురోజుకీ అంతరించిపోతున్నటువంటి వన్యప్రాణులలో ఒకటైన చుక్కల దుప్పి సంరక్షణలో భాగంగా వాటిని అరణ్యంలో విడిచిపెట్టడం జరిగిందనీ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల్ ఎఫ్ఆర్ఓ జి.రత్నాకర్ రావు ,డిప్యూటీ ఎఫ్ఆర్ఓ సాగరిక మరియు ఎబిఓ దీక్ష పాల్గొన్నారు.