మంత్రి చుట్టూ భజన బృందం

మంత్రి చుట్టూ భజన బృందం

ఇటీవల పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రైవేట్‌ పీఎల వ్యవహారంపై ‘నేటిధాత్రి’ కథనాలను ప్రచురించింది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే పీఎల విషయంలో జాగ్రత్త, ప్రైవేట్‌ పీఎల నియామకానికి స్వస్తి పలకండని చెప్పి, ప్రభుత్వం కేటాయించే పీఎలను తానే నియమిస్తానని మంత్రుల ఇష్టా, ఇష్టాలకు సీఎం చెక్‌ పెడితే, అది కాదని చెప్పి ఎర్రబెల్లి ఏకంగా 20మంది పీఎలను నియమించుకున్నట్లు అందిన సమాచారంతో ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ఓ కథనం వెలువరించాం. ఈ కథనం రాయడం మంత్రి దయాకర్‌రావుకు అంతగా నచ్చలేదు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాల్లో ఏకైక మంత్రిని తాను చేస్తున్న పనులను ప్రశ్నిస్తారా…? ఆ పత్రికకు ఎంత ధైర్యం అంటూ అగ్గి మీద గుగ్గిలం అయ్యారట. ఈ మంటను తగ్గించుకోవడం కోసం తాను పిలవగానే ఎస్‌ బాస్‌ అంటూ వాలిపోయే కొంతమంది పెయిడ్‌ జర్నలిస్టులను పిలిపించి తన బాధను వెళ్లగక్కాడట. మంత్రి బాధ బాగానే ఉన్న, కథనం కావాల్సినంత వైరల్‌గా మారి ఎర్రబెల్లి పీఎల వ్యవహారం రాష్ట్రమంతా ప్రచారమైన కొంతమంది కబోదులకు అది మాత్రం కనపడటం లేదు. మంత్రి బాధను మొత్తం విన్న కొంతమంది జర్నలిస్టుల కథనాలను ‘గంజిలో ఈగ’లా తీసిపారేసారట. మీరెంటి…?, మీ హోదా ఏంటీ…?, మీరు ధర్మప్రభువులు, దాన, దయగుణం కలవారంటూ ఎలాంటి మొహమాటం లేకుండా కావాల్సిన తెగ పొగిడేసి ‘నేటిధాత్రి’ సంగతి మేం చూస్తాం అంటూ భరోసా ఇచ్చారట. ‘తాను దుర సందు లేదు..మెడకో డోలు అన్నట్లు’ చేసే దందాలు, వసూళ్ల పర్వాల విషయం…వీరు పనిచేస్తున్న యజమానులకు తెలిసిపోవద్దంటూ బతిలాడి, బామాలి నూరు పట్టుకుని వేలాడుతున్న ప్రబుద్దులు ‘నేటిధాత్రి’కి నీతులు వల్లించే స్థాయికి ఎదిగారట. ఎంత మాత్రం ఆత్మగౌరవం లేకుండా జర్నలిజం విలువలను బజారుకీడ్చి అక్రమార్కులు, రాజకీయ నాయకుల దగ్గర అక్షరాలను తాకట్టు పెట్టిన వీరికి ‘నేటిధాత్రి’ కథనాలను ప్రశ్నించే హక్కు ఎక్కడిదో అర్థం కావడం లేదు. జర్నలిజం వీరి ఇంటి సొత్తు అయినట్లు ‘నేటిధాత్రి’ ఉనికిని ప్రశ్నించే దమ్ము ఎక్కడిదో తెలియాలి. మా సంస్థను మేం కాపాడుకుంటూ ఉన్నంత జర్నలిజాన్ని బతికిస్తూ నిఖార్సయిన వార్తలతో ముందుకు వెళుతున్న మాపై వీరికి ఎందుకు ఇంత కళ్లు కుడుతున్నాయో అర్థం కాదు. సొల్లు వాగుడు, ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లు, ప్రెస్‌నోట్లు, గిట్టుబాటు వార్తలు మాత్రమే రాయడం చేతనైనా వీరు అవి కూడా ఘోస్ట్‌రైటర్‌తో రాయించుకుని మా వార్తలను జబ్బలు చరుచుకునే వీరికి ‘నేటిధాత్రి’ని శంకించే హక్కు ఎంత మాత్రం లేదని స్పష్టం చేస్తున్నాం. ‘ఎనకటికి మా తాత ఎల్లగుర్రం ఎక్కాడు..ఏదో కాయ కాసింది’ అని ఇంట్లో సభ్యుల పేర్లు చెప్పుకుని లబ్ధి పొందే ఇద్దరు జర్నలిస్టులు తామే జర్నలిజం, తామే పై నంచి ఊడిపడ్డాం. మాకే సర్వాధికారులు ఉన్నట్లు జర్నలిస్టుల భావప్రకటన స్వేచ్చకు అడ్డు తగిలే విధంగా, ఏ పత్రికలో, ఏ చానల్‌లో మంత్రికి వ్యతిరేక వార్తలు వస్తున్నాయో గుర్తించి మధ్యవర్తిత్వం వహించినట్లు నటించి, తాము చెప్పి కథనాలు రాకుండా చేస్తున్నామని మంత్రి వద్ద నమ్మబలికి లబ్ధిపొందుతున్న విషయం జర్నలిస్టులకు తెలిసిందే. ఇటీవల పెద్దపత్రిక మాది అంటూ బోర్డు తగిలేసుకుని ఊరేగె ఓ జర్నలిస్టు ‘నేటిధాత్రి’తో మాట్లాడాడు. మన జిల్లా మంత్రిగారు అంటూ ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తూ తాను అక్షరాలను వేలం గట్టి లెక్కగట్టి మరీ అమ్మేస్తున్నాం. మీరు వేలం పెట్టండి, అమ్మకానికి సిద్ధం కండి అంటూ రాయబారిగా వచ్చి బేరసారాలు నడిపే ప్రయత్నం చేశాడు. అది ఎంత మాత్రం కుదరకపోవటంతో ‘నేటిధత్రి’ని పట్టించుకోవద్దని మంత్రికి ఉచిత లచ్చాడట. అణచివేయబడ్డ వారు, సామాజికంగా వెనుకబడిన వారు అంటూ డైలాగులు తెగ వల్లించే ఈ జర్నిలిసు ఏ సామాజికవర్గానికి లబ్ధి చేస్తున్నాడో కాస్త గురెరాలి. ప్రజల పొట్ట కొట్టి, అధికారం ఉంది కదా అంటూ దోపిడికి పాల్పడుతూ ప్రజాధనాన్ని అడ్డగోలు స్వప్రయోజనాల కోసం వృతా చేస్తే ఎందుకు ప్రశ్నించకూడదో ఆ జర్నలిస్టు సమాధానం చెప్పాలి. నీతులు వల్లిస్తూ గోతులు తొవ్వే అతగాడికి ‘నేటిధాత్రి’ని కామెంట్‌ చేస్తే అవసరం ఎందుకు వచ్చిందో చెప్పాలి. పత్రిక ఏదైనా జనం కోసం పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదిగా ఉంటుందని, కథనం ఏమైన జనం నిజానిజాలు గ్రహించి కీలెరిగి వాత పెడతారనే కనీస అవగాహన ఉండాలి. జర్నలిజం అనగా రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పైరవీలు లబ్ధి పొందడాలు, కాసులు సంపాదించి ఊరేగడం కాదని గుర్తుంచుకోవాలి. వసూళ్ల పర్వాన్ని యథేచ్చగా కొనసాగించడానికి ఇతం జర్నలిస్టులపై దుమ్మేత్తిపోసే నీతి, బాహ్యమైన పనులు చెల్లవనీ ‘నేటిధాత్రి’ హెచ్చరిస్తుంది. నిజం ఎప్పటికైన గెలుస్తుంది. జర్నలిజం జనం పక్షానే ఉండగానే తీరుతుంది. మేం రాసే కథనాలపై అనుమాలు ఉంటే మంత్రైనా ఎంతటివారైన వారికి ‘నేటిధాత్రి’ సమాధానమిస్తుంది. కథనాలపై అభ్యంతరం ఉంటే వారికి సంబంధించిన వివరాలను ‘నేటిధాత్రి’ జర్నలిజం విలువలను గుర్తించి తప్పక ప్రచురిస్తుంది. ఏకపక్షంగా ఎప్పుడు వ్యవహరించదు. ఎవరిపై కథనం వచ్చిన వారు ‘నేటిధాత్రి’తో మాట్లాడుకుంటారు. కానీ కొంతమంది జర్నలిస్టుల పెత్తనం మా కథనాలపై చూపిస్తే సహించమని చెప్తున్నాం. మా ఉనికిని ప్రశ్నించవద్దని చెప్తున్నాం. మా పత్రికకు సంబంధించిన ప్రతినిధి మీడియా సమావేశంలో లేనప్పుడు దొంగచాటుగా మంత్రి దగ్గర భేష్‌ అనిపించుకునేందుకు సభ్యత మరచి కామెంట్లు చేయకూడదని అంటున్నాం. అలా చేస్తే ధీటుగా సమాధానం చెప్పడం మాకు తెలసని చెప్తున్నాం. వ్యక్తులు లేనప్పుడు వారి గురించి ప్రస్తావించడం సంస్కారం కాదని కుసంస్కార స్థాయికి దిగజారిన వారిని కోరుతున్నాం. పాతకాలపు మెదళ్లతో తిరుగుతూ ఎంతమాత్రం అప్‌డేట్‌ కాకుండా ఉండే మీకు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ కంటే ‘వెబ్‌ జర్నలిజం’ అత్యంత వేగంగా దూసుకపోతుందని, వసూళ్లు తప్ప సమాజంంలో వస్తున్న మార్పులపై ఎంత మాత్రం అధ్యాయనం చేయలేని మీకు చెబుతున్నాం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *