14 nunchi certificatela parishilana, 14నుంచి సర్టిఫికెట్ల పరిశీలన

14నుంచి సర్టిఫికెట్ల పరిశీలన

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగ నియామక తుదిపరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈనెల 14వ తేదీ నుంచి ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. పరీక్షల్లో ఉత్తీర్ణులైన 1,02,048మంది అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించనున్నట్లు రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి వెల్లడించింది. ఈనెల 14 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 17కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు నియామక మండలి తెలిపింది. అభ్యర్థులు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.టిఎస్‌ఎల్‌పిఆర్‌బి.ఇన్‌ వెబ్‌సైట్‌ నుంచి సమాచార లేఖలను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పేర్కొంది. ఈనెల 12వ తేదీ ఉదయం 8గంటల నుంచి 13వ తేదీ రాత్రి 8గంటల వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని మండలి తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *