ముగిసిన పదవ తరగతి ప్రధాన పరీక్షలు

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 20 పదవ తరగతి పరీక్షా కేంద్రాలలో ప్రధాన పరీక్షలు ప్రశాంతంగా పకడ్బందీగా సిసిటివి నిఘా మధ్య నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ రామ్ కుమార్ తెలియజేశారు. జిల్లావ్యాప్తంగా సాంఘిక శాస్త్రం పరీక్షకు 3,547మంది విద్యార్థులకు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 3536 మంది విద్యార్థులు హాజరైనట్లు 11 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన తెలియజేశారు. అన్ని పరీక్షా కేంద్రాలలో పోలీసు వారి సహకారంతో ప్రతి పరీక్షా కేంద్ర వద్ద 144 సెక్షన్ విధించి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు, జిల్లా కలెక్టర్ ఆదేశంతో పరీక్ష కేంద్రాలలో పరీక్షలలో విధులు నిర్వర్తించుచున్న వ్యక్తులు ఎవరు సెల్ఫోన్ వాడకుండా నిషేధించి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించినట్లు తెలిపారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 4 సెంటర్లను ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి మందల రవీందర్ రెడ్డి, గణపురం, భూపాలపల్లి మండలాల లో జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ రామ్ కుమార్ 3 పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 2 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 8 పరీక్ష కేంద్రాలను తనిఖి చేసినట్లు వారు తెలిపారు.
పరీక్షల అనంతరము విద్యార్థులు సంతోషంతో కేరింతల నడుమ వారి వారి స్వగృహాలకు తల్లిదండ్రులతో వెళ్లడం చాలా సంతోషంగా అనిపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!