కేటీఆర్ ను విద్యార్థి ద్రోహి అని ఫ్లేక్సి లు పెట్టిన వ్యక్తి పై కేసు నమోదు

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటిధాత్రి

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో టిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు ఎడ్ల లక్ష్మణ్ తండ్రి నర్సయ్య 35 సంవత్సరాలు కులం మాల నివాసం ఎల్లారెడ్డిపేట అనే అతను మారవెల్లి రంజిత్ తేది 20 డిసెంబర్ 2022 రోజున ప్రోద్దున 6 గంటల 30 నిమిషాల సమయంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద మంత్రి కేటీఆర్ పోటో ఉన్న ఫ్లేక్సి లను కట్టి విద్యార్థుల ద్రోహి మంత్రి కేటీఆర్ అతను బలపరచిన వ్యక్తి ని ఓడించి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం అని రాసి సెస్ ఎలక్షన్ లో భాగంగా రాజకీయ పార్టీల మధ్య గోడవలు జరిగే విధంగా టిఆర్ఎస్ పార్టీ మనోభావాలు దెబ్బ తినే విధంగా చేయడం జరిగింది అని పిర్యాదు చేయగా ఇట్టి ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ శేఖర్ తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *