స్మశాన వాటికను వదిలిపెట్టని కబ్జాదారులు

తాసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన వడ్డూరి కుమారస్వామి

నెక్కొండ ,నేటి ధాత్రి: స్మశాన వాటికను సైతం కబ్జాదారులు వదిలిపెట్టడం లేదు అత్యంత అత్యాధునికంగా అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తున్న నెక్కొండ గ్రామపంచాయతీ అన్ని సౌకర్యాలతో ఉండడంతో నెక్కొండ గ్రామపంచాయతీ పరిధిలోని భూములకు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఈ తరుణంలోనే ప్రభుత్వ భూమి ఎక్కడ కనిపించినా మూడు కంటికి తెలియకుండా అధికారుల అండదండలతో కబ్జాలకు గురవుతున్నారు. ఈ తరుణంలోనే రాష్ట్ర ప్రభుత్వం దళితుల స్మశాన వాటిక కు సంబంధించిన భూమిని కొంతమంది ప్రబుద్ధులు ఆక్రమణకు గురి చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ టీఎస్ నర్సంపేట ఇంచార్జ్ వడ్డూరి కుమారస్వామి నెక్కొండ తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దళిత రత్న వడ్డూరి కుమారస్వామి మాట్లాడుతూగుంటుపల్లి చెరువు సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన ఉన్న దళితుల స్మశాన వాటిక యొక్క హద్దులు ఏర్పాటు చేయాలని లేదంటే రోజురోజుకు ఆక్రమణకు గురవుతుందని రాను రాను స్మశాన వాటికను సైతం కబ్జాకు గురవుతుందంటూ ఆవేదన వ్యక్తపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *