లక్ష్యం చేరేందుకు మూకుమ్మడి ప్రణాలికలు

ఒక ‘లక్ష్య’ం ముగ్గురి భవితవ్యం

మంత్రి పదవే లక్ష్యంగా అరూరి

మరోమారు కుడా చైర్మన్‌ కొరకు మర్రి

అధినాయకత్వం భరోసా,సముచితస్థానం కొరకు మార్నేని

లక్ష్యం చేరేందుకు మూకుమ్మడి ప్రణాలికలు

వర్ధన్నపేట,నేటిధాత్రి: ఒక ఎన్నిక లక్ష్యం నెరవేర్చి అధినాయకత్వం దృష్టిని ఆకర్షించేందుకు ఆ ముగ్గురు ప్రస్తుతం జరుగుతన్న పార్లమెంట్‌ ఎన్నికల్లో శాయశక్తులా పని చేస్తున్నారు. నిర్ధేశిత లక్ష్యంను అధిగమించి తమ కార్యదక్షతను చూపెందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఒక ఎన్నిక ముగ్గురి భవిష్యత్తుగా మారమేంటి అనుకుంటున్నారా. అవును ఇది నూటికి నూరుపాళ్ళు నిజం.వారిలో ఒకరు రాష్ట్రంలో వరుసగా రెండోమారు శాససభ్యునిగా రెండవ అతిపెద్ద మెజారిటి సాధించిన అరూరి రమేష్‌, మరోకరు కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటి చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి మరియు ఉమ్మడి జిల్లా రైతుసంఘం అధ్యక్షుడు ,వర్ధన్నపేట ఎంపిపి మార్నేని రవిందర్‌రావు .అందరు ప్రస్తుతం పదవుల్లోనే ఉన్నారు. మరి ఇంకా వారి భవితవ్యం ఎంటనుకుంటున్నారా.ఉంది దాని కోరకు ప్రస్తుతం వర్ధన్నపేట శాసనసభ్యులు అరూరి రమేష్‌లు,వరంగల్‌ పార్లమెంట్‌ ఎన్నికల సంధర్భంగా నియోజకవర్గ ఇంచార్జీ భాద్యతలు నిర్వహిస్తున్న కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి,ఎంపిపి మార్నేని రవిందర్‌రావు పాటుపడుతున్నారు.

మంత్రి పదవే లక్ష్యంగా అరూరి రమేష్‌…

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రెండవమారు శాసనసభ్యునిగా ఉన్న అరూరి రమేష్‌ మంత్రివర్గంలో స్థానం కోరకు మంత్రివర్గ విస్తరణకు ముందు విశ్వప్రయత్నాలు చేశారు. స్థానిక ప్రజల్లో కూడా ఈ విషయమై విస్తరణకు ముందు మంత్రి పదవి ఖాయమనే చర్చ కూడా జరిగింది.వరుసగా రెండు పర్యాయాలు రాష్ట్రంలో రెండవ అతిపెద్ద మెజారిటి సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌కు అధినాయకత్వానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేగాక గత ప్రభుత్వంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పని చేసిన కడియం శ్రీహరిని రాజకీయ గురువుగా అరూరి రమేష్‌ భావిస్తారు. కాబట్టి తనకు మంత్రి పదవి వచ్చితీరుతుందనే నమ్మకంతో ఉన్నాడు. జనవరిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఈ మారు అత్యధిక మెజారిటితో విజయం ఇస్తే రానున్న ప్రభుత్వంలో వర్ధన్నపేట నియోజకవర్గం నుండి మంత్రి ఉంటాడనే అంశాన్ని కూడా ప్రచారంలో ప్రధానంగా చెప్పుకొచ్చారు. కాబట్టి ఎన్నికల అనంతరం జరగబోయే విస్తరణలో అవకాశం చేజారకుండా ఉండేందుకు గతంలో పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుండి పోటి చేసిన కడియం శ్రీహరి,పసునూరి దయాకర్‌ల కంటే అధికంగా మెజారిటి వచ్చే విధంగా చూడాలని తద్వారా అధిష్టానం దృష్టిని ఆకర్షించి అవకాశం పొందాలనే లక్ష్యంతో అరూరి రమేష్‌ ముందుకు వెళుతున్నారు.నిర్దేశిత లక్ష ఓట్ల మెజారిటి సాధించి శాసనసభ్యుని నుండి మంత్రిగా మారాలని ఆకాంక్షిస్తున్నారు.

మరోమారు ‘కూడా’ చేజిక్కించుకోవాలని…

ప్రస్తుతం కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటి చైర్మన్‌గా ఉన్న మర్రి యాదవరెడ్డి పదవి కాలం మరో 8 నెలల సమయంతో ముగిసిపోతుంది.ఈ నెపథ్యంలో తనను మరోమారు కుడా కు చేర్మన్‌గా బాధ్యతలు నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. అందు కోరకే ఆయన కూడా ప్రస్తుత పార్టమెంట్‌ ఎన్నికల్లో అధిష్టానం అప్పగించిన ఇంచార్జీ బాధ్యతలను పూర్తిస్థాయిలో విజయవంతంగా నిర్వహించి తన విధేయతను నిరుపించేందుకు పాటుపడుతున్నారు. అయితే ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇంచార్జీ బాధ్యతలు తీసుకున్నప్పటికి అర్బన్‌తో సహా,రూరల్‌ ప్రాంతం కూడా వర్ధన్నపేట నియోజకవర్గంలో భాగమై ఉండడం స్థానిక పార్టీ శ్రేణులు,కార్యకర్తలతో ప్రత్యక్ష సంబంధాలు లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది.అయినప్పటికి స్థానిక ఎమ్మెల్యే అరూరి,మర్రి మిత్రుడు అయిన స్థానిక ఎంపిపి మార్నేని రవిందర్‌రావులు కలుపుకుపోతూ వారి సహాయసహకారాలు అందిస్తున్నారు. ఎది ఎమైనా సాదించాల్పి లక్ష్యం చేరుకుని మరోమారు కుడా చైర్మన్‌గా కోనసాగాలన్నదే మర్రి యాదవరెడ్డి లక్ష్యంగా కనిపిస్తున్నది.

భవిష్యత్తుపై భరోసా కోరకు మార్నేని రవిందర్‌రావు…

గత రెండు ప్రభుత్వాల్లో పని చేసిన అమాత్యులతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి .ప్రస్తుత గ్రామీణ,ఆర్‌డబ్ల్యుఎస్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శిష్యుడిగా,గత ప్రభుత్వంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పని చేసిన కడియం శ్రీహరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న వరంగల్‌ ఉమ్మడి జిల్లా రైతుసంఘం అధ్యక్షుడు,వర్ధన్నపేట ఎంపిపి మార్నేని రవిందర్‌రావు.ఉద్యమ కీలక సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆహ్వనంతో ప్రస్తుత మండల కేంద్రం ఐనవోలులో బహిరంగసభ ఏర్పాటు చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుండి స్థానికంగా టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్మాణం కోరకు తీవ్రంగా కృషి చేశారు. ఆయన కృషి ఫలితంగానే నేడు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పటిష్టంగా ఉంది. అయితే తన రాజకీయ జీవితంలో స్థానికంగా ప్రజాక్షేత్రంలో అన్ని పదవులను చేపట్టి సేవ చేశారు.టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత స్థానికంగా గాని జిల్లాలో గాని పార్టీ అధినాయకత్వం తప్పకుండా రాష్ట్రస్థాయిలో అవకాశం కల్పిస్తారని అంతా అనుకున్నారు. కాని అప్పటి పరిస్థితుల్లో ఆ అవకాశం చేజారింది.అనంతరం ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండవ మార్కెట్‌గా పిలువబడే వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌ చైర్మన్‌గా అవకాశం ఇస్తారని అధిష్టానం నుండి స్పష్టమైన హామి ఇచ్చినట్లు మార్నేని అనుచరులు బహిరంగంగానే చెప్పుకున్నారు. కాని కొన్ని ప్రత్యేక పరిస్థితుల వలన తప్పనిసరి మార్కెట్‌ చైర్మన్‌లను రిజర్వేషన్ల ద్వారా ఎన్నుకోవాల్సి వచ్చింది. దాంతో చైర్మన్‌ పదవికి రిజర్వేషన్‌ కలిసి రాలేదు. అయితే అప్పటికే వర్ధన్నపేట ఎంపిపిగా ఉన్న మార్నేని నామినేటెడ్‌ పదవుల్లో అయినా అవకాశం ఇస్తారని ఆశించారు. కాని అది కూడా జరగలేదు. దాంతో ఎంపిపిగా కొనసాగారు. సాధారణ ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుండి అభ్యర్ధి ఎంపిక విషయంలో అనుహ్యంగా మార్నేని రవిందర్‌రావు పేరు అనుహ్యంగా తెరపైకి వచ్చింది. అధినాయకత్వం దృష్టిలో సమర్ధనాయకుడిగా,సీనియర్‌గా ఉన్నప్పటికి సామాజికకోణంలో మరోమారు అవకాశం చేజారింది.అయితే పార్టీ కార్యక్రమాల్లో,వచ్చిన ప్రతి ఎన్నికలను అనుకూల ఫలితాల కోరకు పాటుపడిన మార్నేని ఎంపిపిగా ఇంకో నెల రోజులు మాత్రమె కొనసాగుతారు.ఈ నెపథ్యంలో రాష్ట్రస్థాయిలో కాకపోయినా కనీసం జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా అయినా అవకాశం వస్తుందని అశించినప్పటికి రిజర్వేషన్‌ రూపంలో మరోమారు రవిందర్‌రావు,వారి అనుచరుల ఆశలను నీరుగార్చింది.దింతో పార్టీలో కీలక నేతగా ఉన్నప్పటికి భవిష్యత్తుపై నిలినీడలు కమ్ముకొవడం పట్ల ఆందోళనవ్యక్తం చేస్తున్నారు.తన భవిష్యత్తు గురించి సాధారణ ఎన్నికల అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ను కలిసిన సంధర్భంగా తన భవిష్యత్తును గురించి మార్నేని ప్రస్తావించారని అయితే ఎలాంటి ఆందోళన చెందవద్దని రానున్న అవకాశాల్లో ప్రథమ స్థానంలో ఉంచి అవకాశం ఇస్తానని హామి ఇచ్చినట్లు చర్చ నడుస్తుంది.ఏది ఎమైనా స్థానికంగా ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉన్న నాయకుడికి భవిష్యత్తు భరోసా లేకపోవడం పట్ల స్థానిక ప్రజల్లో కొంత అసహనం ఉంది.ఇప్పటికైన తన భవిష్యత్తుపై భరోసా ఇచ్చి తనకు సముచితస్ధానం కల్పించాలనే లక్ష్యంతో మార్నేని రవిందర్‌రావు ఈ ఎన్నికల్లో కూడా క్రియాశీలకంగా పని చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *