భుజాలు తడుముకుంటున్న గుమ్మడికాయ దొంగలు? కథనం వెలువడకముందే వెన్నులో వణుకు

భుజాలు తడుముకుంటున్న గుమ్మడికాయ దొంగలు

– వరుస కథనాలతో బెంబేలెత్తుతున్న కొందరు అక్రమ ఎర్నలిస్టులు

– ఇక నెక్ట్స్‌ తమ అవినీతి బయటపడుతుందంటూ సన్నిహితుల వద్ద వ్యాఖ్యలు

– తనపై వార్తకథనం వస్తే దాడికి సిద్దంగా ఉండాలంటూ తన ఉద్యోగులకు సూచించిన ఓ సీనియర్‌ ఎర్నలిస్టు…?

– అంతా తాను చూసుకుంటానని అభయహస్తం

– కథనం వెలువడకముందే వెన్నులో వణుకు

వరంగల్‌ ప్రతినిధి, నేటిధాత్రి : వరుస కథనాలతో కబ్జాయిస్టులు, అక్రమ ఎర్నలిస్టుల వెన్నులో వణుక పుట్టిస్తున్న ‘నేటిధాత్రి’ని బెదిరింపులతో లొంగదీసుకోవచ్చని భావిస్తున్నారు. కొంతమంది తెలివి తక్కువ పిరికి మనుషులు, అవినీతిపరుల కథనాలు అన్ని ప్రచురితం అవుతున్నాయి. ఇక తరువాయి తమపైన వార్త వస్తుందంటూ గుమ్మడి కాయ దొంగల్లా భుజాలు తడుముకుంటున్నారు. కొంతమంది జర్నలిస్టులు అలియాస్‌ ఎర్నలిస్టులు. జర్నలిజం ముసుగు కప్పుకుని తమ చుట్టూ ఉండే భజనపరులకు, అక్షరం ముక్కరాని వారికి గుర్తింపు కార్డులు, అక్రిడిటేషన్లు ఇప్పించి సెటిల్‌మెంట్లు, అక్రమ దందాలకు గ్రేటర్‌ నగరంతో మొదలుకుని వరంగల్‌ ఉమ్మడి జిల్లా మొత్తం తిప్పుతూ సామాన్యులను బెదిరిస్తున్న వీరి గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయట. మీడియా పేరుతో కేవలం పోలీస్‌స్టేషన్లు, రెవెన్యూ కార్యాలయాల్లో తిష్ట వేసి అవినీతి దందాలతో తమ బినామీల ద్వారా అక్రమార్జనకు పాల్పడుతూ సీనియర్‌ జర్నలిస్టులుగా చెప్పుకునే కొంతమంది యూనియన్ల పేరుతో మేథావుల్లా ఫోజులు కొట్టేవారు, తమపై ఎప్పుడు కథనం వెలువడుతుందా అని ఎదురు చూస్తున్నారట. అక్రమాలతో తమకు అసలే సంబంధం లేదని తాము ‘పత్తి ఇత్తులం’ అని చెప్పుకునే వీరు తమపై కథనం వస్తుందని ముందుగానే ఊహించుకోవడం అక్రమార్కులుగా వీరికి, వీరే గుర్తించుకున్నారని స్పష్టం అవుతుంది.

జర్నలిజం ముసుగులో వార్తలు రాయడం తప్ప అన్ని పనులు వెలగబెట్టే ఈ స్వయం ప్రకటిత మేథావుల వల్ల ఒక్క గ్రేటర్‌ నగరంలోనే మూడువందలకుపైగా చదువులేని వారు తమ పేరు తాము రాయలేని వారు, జర్నలిజంలో ఓనమాలు తెలియనివారు ప్రముఖ జర్నలిస్టులుగా ఫోజులు కొడుతున్నారట. వీరికి ఈ స్వయం ప్రకటిత మేథావులు తెరవెనుక సహకరిస్తూ అఇడిటేషన్లు సైతం ఇప్పించారంటే ఏ స్థాయిలో సహకరిస్తున్నారో అర్థం అవుతుంది. నోరు విప్పితే నీతులు, జర్నలిస్టుల అభివృద్ధి పోలీసు పరిచయాలు అంటూ సుద్దపూసలా నీతులు వల్లించే ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌ ఐతే ఇడ్లీలు అమ్ముకునే వ్యక్తికి, అక్రమ బిడీ వ్యాపారం చేసే వ్యక్తికి, ప్లెక్సీ ప్రింటింగ్‌, ప్రెస్‌ నడుపుతున్న వ్యక్తులకు అక్రిడిటేషన్‌ ఇప్పించి రోజు సాయంత్రం కాగానే వారితో నగరంలోని ఓ బార్‌షాప్‌లో తాగి తందానలాడుతాడట. దురదృష్టం ఏంటంటే అరకొర తెలివితేటలు గల ఇతగాడు తానే ప్రముఖ జర్నలిస్టుగా ఫోజులు కొట్టడం, అధికారులు, రాజకీయ నాయకుల వద్ద నుంచి కావాల్సింది దండుకోవడం ఇతగాడికి అలవాటుగా మారిపోయిందట.

గ్రేటర్‌ వరంగల్‌లో పెట్రోల్‌బంక్‌లు మొదలుకుని బార్‌షాపులు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు వద్ద నుంచి నెలవారి మాముళ్లు దండుకునే ఇతగాడు మీరు ఎలాగైన వ్యాపారం చేస్కోండి నీను ఉన్నా అని అభయహస్తం అందించాడట. దీంతో నాణ్యత సరిగా లేకున్నా, కల్తీ జరిగినా వినియోగదారులు నిలదీస్తే, మిగతా జర్నలిస్టులు ఇదేంటని జనంపక్షాన ప్రశ్నించిన, ఈయన గారికే ఫోన్‌ వస్తుందట. సెటిల్‌మెంట్‌ జరిగిపోతుందట. ఓ సీనియర్‌ జర్నలిస్టుకు పెట్రోల్‌బంక్‌ మోసం విషయంలో ఇతగాడి నుంచి స్వీయ అనుభవం కలిగిందట. జర్నలిజం తప్ప, ఆ ముసుగులో అన్ని శాఖల బాధ్యతలు ఎలాంటి జంకు లేకుండా నిర్వహిస్తూ సెటిల్‌మెంట్‌ దందాల్లో ఆరితేరిన ఇతగాడిపై అధికారులు, ఏ మాత్రం చర్యలు తీసుకోరు. వీరి ఆగడాలు నగరంలో శృతిమించుతున్న ఇంటెలిజెన్స్‌ మొదలుకుని ఏ నిఘాసంస్థ అధికారులు వారి శాఖకు కనీసం విషయాన్ని కూడా చెప్పరు. కారణం ఇతగాడి జర్నలిజం ముసుగు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *