ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో రాస్తారోకో

ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో రాస్తారోకో

కాంగ్రెస్‌ను టిఆర్‌ఎస్‌లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ ఎస్‌డిఎల్‌సిఇ జంక్షన్‌ వద్ద ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ అలువాల కార్తీక్‌ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీలపై గెలిచి టిఆర్‌ఎస్‌ పార్టీలకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో గెలిచి తమ సత్తా నిరూపించుకోవాలన్నారు. రాష్ట్రంలో తొలిసారి దళితుడు సీఎల్పీ నాయకుడు కావడాన్ని జీర్ణించుకోలేక దొరల అహంకారంతో కాంగ్రెస్‌ను టిఆర్‌ఎస్‌లో విలీనం చేశారన్నారు. అనంతరం వరంగల్‌ జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ పల్లకొండ సతీష్‌ మాట్లాడుతూ 25మంది ఇంటర్‌ విద్యార్థులు మృతిచెందిన పట్టించుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ స్పందించకుండా కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను బ్లాక్‌మెయిల్‌ చేసి పార్టీలో చేర్పించుకున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో మానుకోట వద్ద విద్యార్థులపై తూటాలు పేల్చిన తెలంగాణ ద్రోహి జగన్‌తో మమేకమై సీఎం కేసిఆర్‌ నేడు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించకపోతే మలిదశ తెలంగాణ ఉద్యమానికి పురుడుపోస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యుఐ జిల్లా జనరల్‌ సెక్రటరీ ప్రేమ్‌చంద్‌, యశ్వంత్‌, చరణ్‌, టోని, నాగరాజ్‌, శ్రవణ్‌, వంశీ, రాజు, దినకర్‌, తిరుపతి, రవి, రమేష్‌, నగేష్‌, తేజ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *