సమాధుల స్థలం కబ్జా గృహ నిర్మాణం, నివాసం

ధారాదత్తం చేసిన భూములు కబ్జా

సమాధుల స్మశాన వాటిక గా వాడకం

సమాధులపై ఇంటిని నిర్మించుకున్న *బాలాజీ* నివాసం..

పిర్యాదు చేసినా పట్టింపులేని అధికారులు

మా స్థలాన్ని మాకివ్వండి *గట్టు* పట్టుదల

 

వరంగల్ సిటి నేటిధాత్రి

అదొక సమాధులు నిర్మాణం చేసుకున్న స్థలం పవిత్రంగా భావించే ఆ స్థలంలో సమాధులు నిర్మించుకొని ఆలయంగా భావించే సమాధుల పై ఓ ఘనుడు కన్నేసి ఏకంగా గృహ నిర్మాణమే చేపట్టాడు వివరాల్లోకి వెలితే గత 70 సంవత్సరాల క్రితం ఇపుడున్న 21 వ డివిజన్ కరిమాబాద్ నానామియా తోటలోని (దాదాబాయి బావి) ప్రాంతంలో తుల్జాబాయి వంశస్తులు కొందరు నిరుపేదలకు వారి భూమిని ధారాదత్తం గా అనుభవించటానికి ఇస్తారు అందులో కొంత మంది గృహ నిర్మాణాలు చేసుకొని నివాసం ఉంటున్నారు అదే విధంగా గట్టు (గౌడ) వంశస్తులకు కేటాయించిన 400 గజాల స్థలంలో గత 70 సంవత్సరాల క్రితం గట్టు వంశస్తుడైన గట్టు రామస్వామికి ఆ స్థలాన్ని కేటాయించి అట్టి స్థలాన్ని గట్టు వంశస్తులు మాత్రమే అనుభవింవించాలని మాట తీసుకుంటారు కొన్ని సంవత్సరాల తరువాత గట్టు రామస్వామి అనే వ్యక్తి మరణిస్తే వారి మృతదేహాన్ని తుల్జాబాయి పెద్దలు కేటాయించిన 400 గజాల స్థలంలోనే సమాధి ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చి అందులో నిర్మించి గట్టు వంశస్తులు ఆ స్థలాన్ని కేవలం గట్టు (గౌడ) వంశస్తుల సమాధులు నిర్మించికోటానికి ఉపయోగించుకునే విధంగా నిర్ణయానికి వస్తారు నాటి నుండి నేటి వరకు దాదాపు 16 మంది రామస్వామి, నారాయణ, సాయన్న, రాజమౌళి, రంగం, వెంకటాచలం, లింగమూర్తి, తిరుపతయ్య, శ్రీనివాస్ ఇలా గట్టు వంశస్తుల సమాధులు అందులో నిర్మించుకుంటారు ఇలా నిర్మించుకున్న స్థలం పై కన్నేసిన సదరు కబ్జా దారులు ఎలాగోలా స్థలాన్ని సొంతం చేసుకోవాలని దురుద్దేశంతో అధికారులతో చేతులు కలిపి ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గట్టు వంశస్తులు ఆరోపిస్తున్నారు గతంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసిన తూతూ మంత్రంగా అలా వచ్చి బెదిరించినట్టు చేసి ఆ తరువాత వాళ్ళు ఇచ్చింది పుచ్చుకొని అటు వైపు కన్నెత్తైన చూడలేదని గట్టు వంశస్తులు చెపుతున్నారు.

 

 

*కరిమాబాద్ లో పేరున్న వ్యక్తులు*

అధికారుల కన్నుగప్పి సమాధుల పై ఇంటిని నిర్మించుకున్న వ్యక్తి పై గతంలో పలు రకాల కేసులు ఉన్నట్టు సమాచారం కరిమాబాద్ లో డాక్యుమెంట్ రైటర్లు గా పేరున్న వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు గట్టు(గౌడ) వంశస్తులు ఆరోపిస్తున్నారు అయినా సమాధులపై ఇంటి నిర్మాణం చేపట్టి ఎలా నివాసం ఉంటారని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు

*పట్టించుకోని అధికారులు*

ప్రస్తుతం తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గతంలో మేయర్ గా ఉన్న తరుణంలో పిర్యాదు చేయటం తో అధికారులను పురమాయించి అట్టి విషయం పై దృష్టి సారించాలని వారిపై చర్యలు తీసుకోవాలని కోరగా అధికారులు పట్టించుకోక పోవటం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి గ్రేటర్ కార్పొరేషన్ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఎటువంటి చర్యలు తీసుకోక పోవటం పై గట్టు వంశస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి వంశ పారంపర్యంగా సమాధులు ఏర్పాటు చేసుకున్నామని సమాధుల స్థలాన్ని ఎవరు కబ్జా చేస్తారులే అనుకున్న మాకు తగు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

*మళ్లీ తెర పైకి వస్తున్న కబ్జాదారులు*

వరంగల్ అండర్ రైల్వేగేటు కరిమాబాద్ ప్రాంతంలో మళ్లీ కబ్జా లకు పాల్పడుతున్న వ్యక్తులు తెరపైకి వస్తున్నట్టు సమాచారం కరోనా కారణంగా లాక్ డౌన్ మూలాన ఈ 40 రోజులు ఎటువంటి అలజడి లేకుండా ఉన్న కబ్జాదారులు మళ్ళీ కబ్జాలకు పాల్పడుతున్నట్టు సమాచారం స్థలం ఖాళీగా కనపడితే చాలు ఆ స్థలం ఎవరిది ఎక్కడ నుండి వారు కొనుగోలు చేశారు అసలు కొన్నారా లేక ధారాదత్తం గా వచ్చిందా అనే వివరాలు సేకరించి అందుకు సంబందించిన పత్రాలు సృష్టించి అమ్మకాలు జరుపుతూ నిర్మాణాలు సాగిస్తున్నారు ఇటువంటి వారి పై దృష్టి సారించి చట్టపరమైన చర్యలు తీసుకుని సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *