తంగళ్ళపల్లి: నేటిధాత్రి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో పెచ్చు మీరుతున్న కొందరు అధికారుల ఆగడాలు.
తనకు తెలియకుండా ఇంటి పర్మిషన్ లు ఇవ్వకూడదని కింది స్థాయి సిబ్బందికి అనాధికార ఆదేశాలు..?
రాజకీయ నాయకుల అండదండలతో ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతున్న వైనం.
ప్రజాప్రతినిధులతో కలిసి జోరుగా మందు విందు పార్టీలు.
ఇంటి పర్మిషన్ కొరకు ఏడాది నుండి తిరిగిన దొరకని పర్మిషన్.
చేతులు తడిపితే గాని… పని కానీ పరిస్థితి.
మండలానికి బాస్ గా మారిన ఆ అధికారి..?
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో కొందరు అధికారులకు పైసలు తడిపితే గాని పనులు కావడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళా సంవత్సరం క్రితం ఇంటి నిర్మాణం కొరకు గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకోని కాళ్ళు అరిగేలా తిరిగిన పర్మిషన్ ఇవ్వడం లేదని మండల ఎంపీడీఓ కు పిర్యాదు చేసింది.
ఇంటి నిర్మాణం పర్మిషన్ కావాలంటే 50 వేల రూపాయలు ఇస్తే ఇంటి పర్మిషన్ వస్తుందని బాధిత మహిళా ఎంపీడీఓ కు తెలిపింది.
పిర్యాదు ను పరిశీలించిన ఎంపిడిఓ లచ్చాలు బాధిత మహిళాకు ఇంటి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదో, సంవత్సరం నుండి మహిళాను ఎందుకు ఇబ్బంది పెట్టారో సంజాయిషీ అడుగుతూ అప్పటి గ్రామ సెక్రటరీ మౌనిక కు మెమో జారీ చేశారు.
గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉండాల్సిన ఇంటి పర్మిషన్ ఫైల్ ఎంపీఓ ఛాంబర్ లో దొరకడం చర్చనీయాంశంగా మారింది.