మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ ను సన్మానించిన యూత్ కాంగ్రెస్

నర్సంపేట,నేటిధాత్రి :

నూతనంగా ఎన్నికైన నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ ను యూత్ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం
ఘనంగా సన్మానించారు.రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన అరు నెలల్లోనే నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో
నర్సంపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా మరోసారి ఎన్నికైన పాలాయి శ్రీనివాస్ ను నర్సంపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేముల ఇంద్రదేవ్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తుమ్మలపెల్లి సందీప్ ఆధ్వర్యంలో పుష్పగుచ్చాలు అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ జాయింట్ సెక్రెటరీ మోడెం ఎల్లాగౌడ్, నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రూపిక శ్రావణ్ కుమార్, ములుకల మనీష్, చెన్నారావుపేట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బండి హరీష్, నల్లబెల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పురుషోత్తం సురేష్, నాయకులు న్యాతిని రాంప్రసాద్, పాల్స ప్రశాంత్, ఎదరబోయిన ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *