ఘనంగా ప్రపంచ మలేరియా దినోత్సవం.

World Malaria Day. World Malaria Day.

ఘనంగా ప్రపంచ మలేరియా దినోత్సవం

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 


గుండాల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సుదీప్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేసి గుండాల కూడలిలో మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దోమల నివారణకు సహకరించి దోమల భారిన పడకుండా ఉండి వాటి ద్వారా వచ్చే వ్యాదులభారిన పడకుండా జాగ్రత్త వహించాలన్నారు. దీనికి గాను ఫ్రైడే ఫ్రైడే నిర్వహిస్తూ ఇంటిలోగాని ఇంటి ఆరుబయట నీరు నిల్వ ఉండకుండా పరిశుభ్రత పాటించాలన్నారు. దోమల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించి వివిధ శాఖల సమన్వయంతో పునరంకీతులై ప్రపంచవ్యాప్తంగా మలేరియాను నిర్మూలించాలని ఆశించారు. భారతదేశంలో 2030 సంవత్సరం కల్లా మలేరియాను పూర్తిగా నిర్మూలించాలనె లక్ష్యంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ వి భూలక్ష్మి, మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ సత్యం, ఎల్ టీ రమేష్, ఎఎన్ఎంలు భువనేశ్వరి,అరుణ, మంగవేణి,కమల, హెల్త్ అసిస్టెంట్ రమేష్, ఏమ్ ఎల్ హేచ్ పీ సంగీత, ఆశాకర్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!