నేటి ధాత్రి యాదాద్రి భువనగిరి:
మండల కేంద్రంలో ప్రపంచ పర్యావరణ సందర్భంగా దివిస్ పరిశ్రమ నందు కార్మికులు ఉద్యోగులందరూ పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతిజ్ఞ చేశారు. భూ పునరుద్ధరణ ఎడారి కరణ మరియు కరువు ను తట్టుకోవడం కొరకు అవగాహనపై ర్యాలీని మొబైల్ ఎగ్జిబిషన్ను కంపెనీ ఆవరణలో నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ పై మరింత సమాచారాన్ని ఉద్యోగులందరికీ తెలియపరచడం కోసం పర్యావరణ అవగాహన సెంటర్ నందు దృశ్య_ శ్రావణ ప్రారంభించారు .ఈ కార్యక్రమంలో దివిస్ పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ s రామకృష్ణ ,P శ్రీనివాస్, జనరల్ మేనేజర్ G బాల కిషోర్ P సుధాకర్, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ D. Vరాఘవేంద్రరావు మరియు పరిశ్రమ ఉద్యోగులు మరి యు సిబ్బంది పాల్గొన్నారు.