ప్రపంచ వికలాంగుల దినోత్సవం పాఠశాలలో..
నిజాంపేట: నేటి ధాత్రి
ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో వికలాంగుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి సాంగాని యాదగిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివ్యాంగ విద్యార్థుల హక్కులు, తల్లిదండ్రుల బాధ్యత గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
