సమాజ అభివృద్ధిలో కార్మికులదే కీలకపాత్ర.!

workers workers

సమాజ అభివృద్ధిలో కార్మికులదే కీలకపాత్ర -మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల

రామడుగు నేటిధాత్రి:

సమాజాభివృద్ధిలో కార్మికులదే కీలకపాత్రాని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల తిరుపతి ముదిరాజ్ అన్నారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికుల చేత జెండా ఎగర వేయించారు. అనంతరం కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపి వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా చెర్మెన్ మాట్లాడుతూ కార్మికుల శ్రమకు గౌరవం కల్పించడమే మే డే ఉద్దేశమని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం మార్కెట్ కమిటీ ఎల్లప్పుడూ అంకిత భావంతో పనిచేస్తుందని తెలిపారు. ఈకార్యక్రమంలో వైస్ చైర్మన్ పిండి సత్యం రెడ్డి, డైరెక్టర్లు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!