విద్యార్థి, యువజన విభాగం సమ్మేళనం విజయవంతం అయ్యేందుకు కృషి చేయండి

వేములవాడ, నేటిధాత్రి:

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నవంబర్ 6న వేములవాడ పట్టణంలో నిర్వహించబోయే బి.ఆర్.ఎస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగం సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ సూచించారు. గురువారం వేములవాడ పట్టణంలోని బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు నివాసంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు అధ్యక్షతన వేములవాడ పట్టణ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ 6వ తేదీన నిర్వహించే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తో పాటు మరికొంత మంది ప్రముఖులు హాజరుకానున్నారని, ఈ క్రమంలో ఈ సమ్మేళనానికి పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు తరలివచ్చేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. అట్లాగే వేములవాడ మున్సిపల్ లో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికి గతంతో పోలిస్తే ఎంతో అభివృద్ధి చెందిందని, ఇటీవలే రాజన్న ఆలయం ముందు రోడ్డు విస్తరణ కొరకు రూ.35 కోట్లు మంజూరయ్యాయని, రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకువచ్చి వేములవాడ పట్టణాన్ని, దేవాలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే బాధ్యత బి.ఆర్.ఎస్ పార్టీ తీసుకుంటుందని, రాబోయే ఎన్నికల్లో పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు గెలుపు కొరకు అందరూ కలసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు, మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి-రాజులతో పాటు బి.ఆర్.ఎస్ పార్టీ కౌన్సిలర్లు,కో-అప్షన్ సభ్యులు, వార్డ్ కమిటీ అధ్యక్షులు, సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!