వర్షం కోసం మహిళల ప్రత్యేక పూజలు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని కోరుతూ ఝరాసంగం మండలంలోని బర్దీపూర్ మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. జహీరాబాద్, కుప్పానగర్, అల్లిపూర్, మాచ్నూర్, తదితర గ్రామాలకు చెందిన మహిళలు గంగా పూజలో పాల్గొన్నారు. మహిళలు రాగి కలశాలలో నీటిని నింపి ఊరేగింపుగా బయలుదేరారు. ఊరేగింపు అనంతరం దత్తగిరి క్షేత్రంలో పీఠాధిపతి అవధూత గిరి మహారాజ్తో కలిసి జ్యోతిర్లింగాలకు నీటితో అభిషేకం చేశారు.