చీకటి ఒప్పందం కుదుర్చుకునే వారికి బుద్ధి చెప్పాలి
అభివృద్ధి చేశాను మరోసారి ఆశీర్వదించండి..
బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్ది
భాజపా,కాంగ్రెస్ పార్టీల నుండి బిఆర్ఎస్ లో చేరికలు..
నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి :
కరోనా సమయంలో కష్టాలలో ఉన్న ప్రజల కన్నీళ్లు తుడిచిన, నిత్యం ప్రజలతోనే ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన మరోసారి నన్ను ఆశీర్వదించండి అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ ప్రజలను వేడుకున్నారు.
భారత్ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దుగ్గొండి మండల కేంద్రంలో అలాగే గిర్నిబావి గ్రామంలో ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ 2014 సంవత్సరంలో ప్రతిపక్ష పార్టీల ఒప్పందాలతో ఉద్యమకారున్ని ఓడించడానికి కుట్రలు పన్నారు అయినా నేను ఓడిపోయినప్పటికీ నియోజకవర్గంలో ఎన్నో రకాల అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు తీసుకొచ్చాను. మరల 2018 ఎన్నికలలో ఇద్దరు ప్రతిపక్ష నాయకులు మరోసారి ఒప్పందం చేసుకొని ఒకరు నర్సంపేట నుండి నాపై మరొకరు వరంగల్ నుండి పోటీ చేసి ఓడించడానికి కుట్రలు చేసిన ప్రజలు అభివృద్ధిని చూసి నన్ను గెలిపించారు. నర్సంపేటను అభివృద్ధి మేమే చేశామని అబద్ధాలు మాట్లాడిన
అదే ఇద్దరు నాయకులు చీకటి ఒప్పందాలు చేసుకొని ఒకే గూటిలో చేరి ఇటు ప్రజలను అటు పార్టీ కార్యకర్తలను మోసం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డిలపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ధ్వజమెత్తారు. 70 ఏళ్లు నిండిన ఒక పెద్దమనిషి కేంద్రం నుండి ఇది తెచ్చిన అది తెచ్చిన అంటూ నియోజకవర్గ ప్రజలను నమ్మవలకుతూ మరో పార్టీలో చేరుతుండడం ఆ పార్టీపై పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మ విశ్వాసంపై దెబ్బకొట్టి మోసం చేశాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నం మొగిలి, మండల పార్టీ అధ్యక్షుడు రాజేశ్వర్ రావు, టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ అధికార ప్రతినిధి శానబోయిన రాజ్ కుమార్, వంగేటి అశోక్ కుమార్, ఆర్ఎస్ఎస్ మండల కన్వీనర్ తోకల నరసింహ రెడ్డి,
వైస్ ఎంపీపీ జైపాల్ రెడ్డి, సొసైటీ చైర్మన్లు ఊరటి మైపాల్ రెడ్డి, పైడి,నాయకులు శంకేశు కమలాకర్, బూర హేమచంద్ గౌడ్, కంచర కుంట్ల శ్రీనివాస్ రెడ్డి, పుచ్చకాయల బుచ్చిరెడ్డి, అరె జైపాల్ రెడ్డి,ఎంపిటిసి పిండి కుమారస్వామి, సర్పంచులు మమత రాజు,ఏడెల్లి రజిత ఉమేష్ రెడ్డి, కొండం రమాదేవి విజేందర్ రెడ్డి, బొమ్మగాని ఊర్మిళ వెంకటేశ్వర్లు,నారాయణ రెడ్డి, మోడెం విద్యాసాగర్, కామిశేట్టి ప్రశాంత్,నాగణబోయిన తిరుపతి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
# భాజపా,కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరికలు..
దుగ్గొండి మండలం నాచినపల్లి, మధిర, మందపల్లి గ్రామాల నుండి బిజెపి పార్టీ మండల ఉపాదక్ష్యులు రఘుపతి రెడ్డి, మహిళా మోర్చా నాయకురాలు దోర్నాల మంజులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు గులాబీ కండువాను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
# పార్టీలో చేరిన వారి వివరాలు..
జన్ను గోవర్ధన్,శెట్టి అశోక్,మంద సంజీవ,కొత్తపెళ్లి సుధాకర్, మాదాసి శ్రీనివాస్,రఘు,పాపిరెడ్డి,విష్ణురెడ్డి, మహిపాల్ రెడ్డి,ఈసంపెళ్లి చేరాలు ల కుటుంబాలు చేశారు.
# నర్సంపేట మున్సిపల్ 1వ వార్డు నుండి చేరికలు..
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డుకు చెందిన 15 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి స్థానిక కౌన్సిలర్ కౌన్సిలర్ దేవోజు తిరుమల సదానందం అధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్ధి పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పిన ఎమ్మెల్యే స్వాగతించారు. కెసిఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆకర్షితులై పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి సమచితస్థానం ఉంటుందని పేర్కొన్నారు.
# పార్టీ లో చేరినవారిలో..
మేక వెంకన్న,బోల్లు రాములు,బోల్లు వెంకటేష్,పాలడుగుల సమక్క,జెట్టి ప్రవీణ్,జెట్టి వరలక్ష్మి ,మేక రత్నా,తోట మంజుల,బొల్లు చంద్రం,దనబోయిన పద్మ,కిస్టోజు స్వాతి,ప్రణయ్,మహేష్,
బోల్లు మంగమ్మ,దనబోయిన పిరయ్య,
బిల్లు రజిత ఉన్నారు.ఈ కార్యక్రమంలో 1 వార్డు పార్టీ అధ్యక్షులు కొల్లాపురం రాజేశ్, యూత్ అధ్యక్షులు కుసుంభ నిరంజన్, కార్యదర్శి కొల రమేష్, ప్రచార కార్యదర్శి దేంచనాదుల సతీష్, పట్టణ ఎస్సీ సెల్ కోశాధికారి ఎర్ణం మధు, గదే శ్రీను, దండు సాయి, శిరంశెట్టి నగేష్, ఆసం విజయ్, కందకట్ల సతీష్, గడ్డం వినయ్, తదితరులు ఫాల్గొన్నారు.