*భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు*
*పరకాల,నేటిధాత్రి*
మండలంలోని మల్లక్కపేట గ్రామ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఉదయం 4 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను ప్రారంభించారు.దేవాలయాన్ని పూలతో, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించగా భజనలు, నామస్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగాయి.
మధ్యాహ్నం 1 గంట నుండి మాల విరమణ కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వామివారికి 108 తమలపాకులతో,108 వడపేర్లతో ప్రత్యేక అర్చనలు ఘనంగా నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకులు కాటూరి జగన్నాథ చార్యులు వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించగా భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
