ప్రతి వార్డు నుండి కదలి రావాలి కదం తొక్కుతూ.

Elkathurthi Elkathurthi

ప్రతి వార్డు నుండి కదలి రావాలి కదం తొక్కుతూ.

శనిగరం శ్రీనివాస్ ఎస్సీ సెల్ పరకాల పట్టణ అధ్యక్షుడు

పరకాల నేటిధాత్రి

చరిత్రలో నిలిచేలా రజతోత్సవం గ్రామగ్రామాన పండుగ వాతావరణం
ఇప్పటికే సిద్ధమవుతున్న పల్లెలు, పట్టణాలు
దేశంలోనే అతిపెద్దగా సభగా రికార్డు సృష్టించే అవకాశం ఈ సభను విజయవంతం చేయాలి,ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బిఆర్‌ఎస్‌ రజతోత్సవ మహాసభకు సుమారు 1,300 ఎకరాల సువిశాల ప్రదేశంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయని పరకాల పట్టణ టిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు శనిగరం శ్రీనివాస్ తెలిపారు.పరకాల పట్టణంలో వారు మాట్లాడుతూ ఈ సభకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో ప్రజలను తీసుకురావాలని కోరారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాలతో పట్టణం లోనీ 18వ వార్డు లో స్థానిక భారాస నాయకులతో కలసి సభ వాల్ పోస్టర్స్ ఆవిష్కరించారు ఈ సభ నభూతో నభవిష్యత్ అనే విధంగా సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ సభ కేవలం రాజకీయ కార్యక్రమం కాదని, ఇది ఒక విశాల సంకల్పానికి సాంకేతమని, ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ, భవిష్యత్తు దారి చూపే దిశగా ప్రజల నడిపించే ప్రయత్నం చేసే సభ అని పేర్కోన్నారు కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావు నాయకత్వంలో మళ్లీ తెలంగాణలో టిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత ఏర్పడిందని తెలిపారు సోమవారం 18వ వార్డులో ప్రజలకు సభ గురించి చైతన్యం కల్పించారు.ఏ గ్రామంలో చూసినా ఏప్రిల్‌ 27న ఎల్కతుర్తిలో జరిగే తెలంగాణ ఇంటి పార్టీ రజతోత్సవ వేడుకల గురించే చర్చ జరుగుతున్నదని రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎల్కతుర్తి సభ రికార్డు సృష్టిస్తుందని శనిగరం శ్రీనివాస్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!